Intermediate pass: తాజాగా మనం చూసుకుంటే, తెలంగాణాలో ఇంటర్ ఫస్ట్ ఇయర్ ఫలితాల్లో అత్యంత తక్కువ పాస్ పర్సంటేజ్ నమోదయ్యింది. కరోనా కారణంగా, ఆన్ లైన్ క్లాసులు సరిగా అర్థం కాక ముఖ్యంగా పల్లె విద్యార్థులు చాలా నష్టపోయారనే చెప్పుకోవాలి. ఆ కారణంగా వారి తల్లిదండ్రులు.. తమ పిల్లలు కరోనా కాలంలో చదవలేకపోయారని చెప్పిన సంగతులు మనం చూసాం. ఈ కారణంగానే వారు ఫెయిల్ అయ్యారని వారు గట్టిగా వాదిస్తున్నారు. ఈ క్రమంలో కొన్ని రోజుల క్రితం ఓ విద్యార్థి సూసైడ్ నోట్ కలకలం సృష్టించిన విషయం తెలిసినదే.
విద్యార్థి సంఘాలు డిమాండ్ ఏమిటి?
ఈ విషయమై విద్యార్థి సంఘాలు ఫెయిల్ అయిన విద్యార్థులందరినీ కనీస మార్కులతో పాస్ చేయాలని ఇంటర్ బోర్డ్, ప్రభుత్వాన్ని గట్టిగా డిమాండ్ చేస్తున్నాయి. ఇక ఈ డిమాండ్ పై ప్రభుత్వం ఎలా స్పందిస్తుందో చూడాలి మరి. తాజాగా ఇంటర్ విద్యా పరిరక్షణ సమితి ఆరోపిస్తూ.. “కేవలం కార్పొరేట్ కళాశాలలకు లాభం చేకూర్చేందుకే ఇంటర్ ఫస్ట్ ఇయర్ పరీక్షలను బోర్డు నిర్వహించింది.” అని దెప్పుపొడిచింది. ఆన్ లైన్ విద్యకు దూరమైన ప్రభుత్వ కాలేజీల విద్యార్థులు ఈ విషయంలో తీవ్రంగా నష్టపోయారని పేర్కొంది.
తెలంగాణ ఇంటర్ బోర్డ్ రియాక్షన్ ఏమిటి?
ప్రస్తుతానికి తెలంగాణ ఇంటర్ బోర్డ్ రియాక్ట్ కాలేదనే చెప్పుకోవాలి. కానీ విద్యార్థి సంఘాలు ఈ విషయంలో తగ్గేదే లేదని మొండి పట్టు పట్టాయి. ఖచ్చితంగా ఫెయిల్ అయినటువంటి విద్యార్థులను కనీస మార్కులతో పాస్ చేయాలని వారు డిమాండ్ చేస్తున్నారు. తాజాగా ఈ సంఘాలు తమ డిమాండ్ ను మరింత ముమ్మురం చేసాయి. మనకు తెలిసిందే… కరోనా ప్రభావంతో విద్యా వ్యవస్థ తీవ్ర నష్టాలకు చేరుకుంది. విద్యార్థుల జీవితాలతో కరోనా చెలగాటం ఆడిందనే చెప్పుకోవాలి. మరి ఇలాంటి పరిస్థితుల్లో ఫెయిల్ అయిన వారిని పాస్ చేస్తారా లేదా చూడాలి.