Pawan Kalyan: ఇండస్ట్రీలో క్రేజీ కాంబినేషన్ లలో ఒక కాంబినేషన్ డైరెక్టర్ పూరి.. పవన్ కాంబినేషన్. వీళ్ళిద్దరి కలయికలో స్టార్టింగ్ లో బద్రి సినిమా రావడం జరిగింది. 2000 సంవత్సరంలో వచ్చిన ఈ సినిమా సూపర్ డూపర్ హిట్ అయింది. దర్శకుడిగా పూరి జగన్నాథ్ మొదటి సినిమాలోని హీరోయిజం ఒరేంజ్ లో చూపించడం జరిగింది. చాలా స్టైలిష్ గా అదే విధంగా పవర్ ఫుల్ గా బద్రి సినిమాలో పవన్ కళ్యాణ్ ని వెండితెరపై ప్రజెంట్ చేయడం జరిగింది. మొదటి సినిమాతోనే డైరెక్టర్ పూరీకి ఇండస్ట్రీలో మంచి పేరు వచ్చింది. ఆ తర్వాత వరుసగా బ్యాక్ టు బ్యాక్ విజయాలు అందుకోవటం జరిగింది.
“బద్రి” తర్వాత పవన్ కళ్యాణ్ తో పూరి జగన్నాథ్ అనేక సినిమాలు చేయాలని కథలు వినిపించడం జరిగింది. రవితేజతో తీసిన “ఇడియట్”, “అమ్మ నాన్న ఓ తమిళమ్మాయి”.. మహేష్ బాబుతో తీసిన “పోకిరి” ఈ మూడు కథలు మొదట పవన్ కళ్యాణ్ వద్దకు వెళ్లగా ఆయన రిజెక్ట్ చేయడం జరిగింది. కానీ ఆ కథలు పవన్ కి నచ్చకపోవటంతో అదే స్టోరీతో వేరే హీరోలతో పూరి సినిమాలు చేసి హిట్స్ అందుకున్నారు. అయితే ఆ తర్వాత 2013వ సంవత్సరంలో “కెమెరామెన్ గంగతో రాంబాబు” అనే సినిమా వీరి కాంబినేషన్ లో తెరకెక్కింది. దాదాపు 13 సంవత్సరాల తర్వాత వీళ్ళ కలయికల్లో సినిమా వస్తూ ఉండటంతో ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నగా బాక్సాఫీస్ వద్ద “కెమెరామెన్ గంగతో రాంబాబు” బోల్తా పడింది.
ఇదిలా ఉంటే ఇండస్ట్రీలో రీ రిలీజ్ సినిమాల హవా నడుస్తున్న సంగతి తెలిసిందే. ఈ రకంగానే ఇప్పుడు తాజాగా పూరి జగన్నాథ్ దర్శకత్వంలో పవన్ నటించిన “కెమెరామెన్ గంగతో రాంబాబు” ఫిబ్రవరి 7వ తారీకు రీ రిలీజ్ చేస్తున్నట్లు ఆ చిత్ర నిర్మాణ సంస్థ యూనివర్సల్ మీడియా స్పష్టం చేయడం జరిగింది. దీంతో పవన్ ఫ్యాన్స్ సంబరాలు చేసుకుంటున్నారు.
Mogali Rekulu: మెగా ఫ్యామిలీతో సందడి చేసిన మొగలిరేకులు ఆర్కే నాయుడు.. వైరల్ అవుతున్న ఫొటోస్..!