Samantha: ప్రముఖ హీరోయిన్ సమంత గురించి కొత్తగా పరిచయాలు అక్కర్లేదు. `ఏ మాయ చేశావే` వంటి సూపర్ హిట్ మూవీతో సినీ ఇండస్ట్రీలోకి అడుగు పెట్టి.. అనతి కాలంలోనే స్టార్ హోదాను దక్కించుకుంది. తెలుగు, తమిళ్ భాషల్లో ఎన్నో విజయవంతమైన చిత్రాలు చేసిన సమంత.. 2017లో తన తొలి సినిమా హీరో అయిన అక్కినేని నాగచైతన్యను ప్రేమించి పెళ్లి చేసుకుంది.
గోవాలో వీరి వివాహం అంగరంగ వైభవంగా జరిగింది. కానీ, ఏం లాభాం.. పెళ్లై నాలుగేళ్లు గడవక ముందే ఈ జంట వైవాహిక జీవితానికి స్వస్తి పలికారు. ప్రస్తుతం కెరీర్ పైనే దృష్టి పెట్టిన సమంత.. తాజాగా ఓ కీలక నిర్ణయం తీసుకుందట. అదేంటంటే.. సెకెండ్ ఫీ మేల్ లీడ్ రోల్ కానీ లేదా నటనకు అంత ఆస్కారం లేని పాత్రలు వస్తే ససేమిరా చేయకూడని నిశ్చయించుకుందట.
- Read the latest news from NEWSORBIT
- Follow us on facebook , Twitter , instagram and Googlenews
ఈ నేపథ్యంలోనే ఇటీవల అటువంటి పాత్రలు వచ్చినా నిర్మొహమాటంగా నో చెప్పేసింది. భారీ కమర్షియల్ సినిమాల్లో అయితే నటిస్తానని చెబుతోందట. మరి ఇందులో ఎంత వరకు నిజమో తెలియాదు గానీ.. నెట్టింట మాత్రం ఈ వార్త తెగ వైరల్ అవుతోంది. కాగా, సినిమాల విషయానికి వస్తే.. సమంత ఇప్పటికే గుణశేఖర్ దర్శకత్వంలో `శాకుంతలం` అనే సినిమాను పూర్తి చేసింది.
ఆ తర్వాత హరి – హరీష్ దర్శకులుగా శ్రీదేవి మూవీస్ బ్యానర్పై సీనియర్ నిర్మాత శివలెంక కృష్ణ ప్రసాద్ నిర్మిస్తున్న `యశోద`లో నటించింది. ఈ రెండూ పాన్ ఇండియా చిత్రాలే కాగా.. త్వరలోనే ఇవి ప్రేక్షకుల ముందుకు రానున్నాయి. అలాగే మరోవైపు ఈ బ్యూటీ విజయ్ దేవరకొండ సరసన `ఖుషీ` అనే లవ్ స్టోరీ చేస్తోంది. వీటితో పాటు మరిన్ని ప్రాజెక్ట్స్ సైతం సమంత చేతిలో ఉన్నాయి.
Baahubali: సరికొత్త కథతో ఓటీటీలోకి వచ్చేస్తున్న బాహుబలి.. రిలీజ్ డేట్ ఇదే..!