Sarkaru Vaari Paata: సూపర్ స్టార్ మహేశ్ బాబు తాజా చిత్రం `సర్కారు వారి పాట`. ఇందులో కీర్తి సురేష్ హీరోయిన్గా నటించగా.. పరుశురామ్ దర్శకత్వం వహిస్తున్నాడు. మైత్రి మూవీ మేకర్స్, జీఎమ్బి ఎంటర్టైన్మెంట్, 14 రీల్స్ ప్లస్ బ్యానర్లపై నవీన్ యెర్నేని, వై. రవిశంకర్, రామ్ ఆచంట, గోపి ఆచంట సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మించగా.. తమన్ స్వరాలు అందించాడు.
భారీ అంచనాలు ఉన్న ఈ చిత్రం మే 12న గ్రాండ్గా విడుదల కాబోతోంది. ఈ నేపథ్యంలోనే ప్రమోషన్స్ షురూ చేసిన మేకర్స్.. సర్కారు వారి పాట ప్రీ రిలీజ్ ఈవెంట్ ను మే 7న హైదరాబాద్లోని యూసుఫ్గూడ పోలీస్ గ్రౌండ్స్లో నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలుస్తోంది. అయితే ఈ ఈవెంట్కు గెస్ట్గా పూరీ జగన్నాథ్ రాబోతున్నాడని తాజాగా ఓ టాక్ బయటకు వచ్చింది.
- Read the latest news from NEWSORBIT
- Follow us on facebook , Twitter , instagram and Googlenews
వాస్తవానికి పరుశురామ్ పూరీ జగన్నాథ్కి దగ్గర బంధువు. దర్శకుడు కాకముందు పూరీ దగ్గర ఆయన అసిస్టెంట్ గా పనిచేశాడు. ఈ నేపథ్యంలోనే పరుశురామ్ పూరీని గెస్ట్గా ఆహ్వానించారని.. అందుకు ఆయన కూడా వస్తానని మాటిచ్చారని అంటున్నారు. అయితే ఇప్పుడీ విషయంమే నెట్టింట చర్చలు దారి తీసింది. ఇందుకు కారణం లేకపోలేదు.. మహేష్ బాబు-పూరీ జగన్నాథ్ ల మధ్య గత కొద్ది రోజులు నుంచీ మాటలు లేవనే టాక్ ఉంది.
మహేష్ బాబుకు పోకిరి, బిజినెస్ మేన్ వంటి సూపర్ హిట్స్ ఇచ్చిన పూరీ జగన్నాథ్.. ఆ తర్వాత ముచ్చటగా ఆయనతో `జనగణమన`ను తెరకెక్కించాలని అనుకున్నారు. కానీ, మహేష్ ఈ ప్రాజెక్ట్ చేసేందుకు ముందుకు రాలేదు. అప్పటి నుంచే వీరిద్దరికి చెడిందని వార్తలు వచ్చాయి. పైగా పూరీ మహేష్ పై పరోక్షంగా ఎన్నో సార్లు విమర్శులు కూడా గుప్పించారు. మరి ఇప్పుడు సర్కారు వారి పాట ప్రీ రిలీజ్ ఈవెంట్కు పూరీ గెస్ట్గా వస్తే.. మహేష్ కు, తనకు మధ్య ఉన్న విభేదాలు తొలగిపోయాయని చెప్పినట్లే అవుతుంది.
Baahubali: సరికొత్త కథతో ఓటీటీలోకి వచ్చేస్తున్న బాహుబలి.. రిలీజ్ డేట్ ఇదే..!