Shriya Saran: మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ సతీమణి, అపోలో చైర్మన్ ప్రతాప్ రెడ్డి మనవరాలు ఉపాసన కొణిదెల గురించి ప్రత్యేకంగా పరిచయాలు అవసరం లేదు. కేవలం మెగా కోడలిగానే కాకుండా అపోలో హెల్త్ కేర్ బాధ్యతలను కూడా నిర్వహించే ఉపాసనకు తాజాగా హీరోయిన్ శ్రియ స్పెషల్ థ్యాంక్స్ చెప్పింది. అసలు ఈమె ఉపాసనకు ఎందుకు థ్యాంక్స్ చెప్పిందో తెలియాలంటే లేట్ చేయకుండా అసలు మ్యాటర్లోకి వెళ్లాల్సిందే.
`ఇష్టం` మూవీలో తెలుగు ఇండస్ట్రీలోకి అడుగు పెట్టి అనతి కాలంలోనే స్టార్ స్టేటస్ను దక్కించుకున్న శ్రియ.. టాలీవుడ్లో దాదాపు స్టార్ హీరోలందరి సరసనా ఆడిపాడింది. తెలుగుతో పాటు తమిళ్, కన్నడ, హిందీ భాషల్లోనూ నటించిన ఈ బ్యూటీ.. 2018లో రష్యాకు చెందిన టెన్నిస్ క్రీడాకారుడిని ప్రేమించి పెళ్లి చేసుకుంది.
2020లో శ్రియ ఓ పాపకు జన్మనివ్వగా.. ఆమెకు రాధ అనే పేరు పెట్టారు. అయితే సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉండే శ్రియ.. తాజాగా ఆపరేషన్ కు సిద్ధంగా వున్న తన భర్త ఆండ్రూ ఫొటోను షేర్ చేసింది. `ఆండ్రూకి హెర్నియా వుంది. దాని కారణంగా ఇబ్బందిపడుతున్న ఆండ్రూ గత రెండు నెలల నుంచీ రాధని ఎత్తుకోలేకపోయాడు.
అయితే ఇప్పుడు సమస్య తీరింది. ఆండ్రూ విషయంలో అపోలో హాస్పిటల్స్ వారు పాజిటివ్ గా స్పందించి ప్రత్యేక కేర్ తీసుకున్నారు. అంతే కాకుండా డాక్టర్ రజనీష్ రెడ్డికి, మాకు సహకారాన్ని అందించినందుకు ఉపాసన కొణిదెలకు ప్రత్యేక ధన్యవాదాలు` అంటూ శ్రియ తన పోస్ట్ కింద రాసుకొచ్చింది. దీంతో ఆమె పోస్ట్ కాస్త వైరల్గా మారింది.
https://www.instagram.com/p/CajIsALsrtw/?utm_source=ig_web_copy_link