Trivikram: మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ ఇండస్ట్రీలో రాణించటంలో తొలి దినాలలో స్రవంతి మూవీస్ బ్యానర్ అధినేత స్రవంతి రవి కిషోర్ ప్రముఖ పాత్ర పోషించారు. తన బ్యానర్ లో తరుకెక్కిన నువ్వే నువ్వే సినిమాకి రచయితగా అవకాశం ఇచ్చారు. ఆ తర్వాత “నువ్వే నువ్వే”తో త్రివిక్రమ్ ని దర్శకుడిగా పరిచయం చేయటం జరిగింది. ఇక తర్వాత తెలుగు సినిమా రంగంలో టాప్ హీరోలు పవన్ కళ్యాణ్, మహేష్ బాబు, ఎన్టీఆర్, చిరంజీవి, నాగార్జునలతో అవకాశం అందుకుని ఇండస్ట్రీలో ఇప్పుడు అగ్ర దర్శకులలో ఒకరిగా రాణిస్తున్నారు.
అటువంటి త్రివిక్రమ్ జన్మదినం నవంబర్ 7వ తారీకు కావటంతో… స్రవంతి మూవీస్ బ్యానర్ వాళ్లు “నువ్వే నువ్వే” సినిమా స్పెషల్ షోలు రెండు తెలుగు రాష్ట్రాలలో వేస్తున్నారు. ఈ సినిమా వచ్చి 20 సంవత్సరాలు కావడంతో పాటు దర్శకుడిగా త్రివిక్రమ్ కి మొదటి సినిమా కావడంతో ఆయన జన్మదినం నాడు ఈ రకమైన స్పెషల్ షోలు వేసి ఆయనకి బర్త్డే గిఫ్ట్ ప్లాన్ చేసినట్లు సమాచారం. ప్రస్తుతం త్రివిక్రమ్ … మహేష్ బాబు సినిమా షూటింగ్ తో బిజీగా ఉన్నారు.
“SSMB 28” వర్కింగ్ టైటిల్ తో తెరకేక్కుతున్న ఈ సినిమా షూటింగ్ శరవేగంగా సాగుతోంది. వచ్చే ఏడాది ఏప్రిల్ 28వ తారీకు సమ్మర్ కానుకగా విడుదల కానుంది. ఆల్ రెడీ మహేష్ బాబుతో త్రివిక్రమ్ చేసిన అతడు, ఖలేజా రెండు కూడా ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకున్నాయి. దీంతో వీరిద్దరి కాంబినేషన్ లో వస్తున్న ఈ మూడో సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. మహేష్ సినిమా తర్వాత పవన్ కళ్యాణ్ తో ఓ భారీ పాన్ ఇండియా సినిమా త్రివిక్రమ్ ప్లాన్ చేస్తున్నట్లు ఇండస్ట్రీలో వార్తలు వస్తున్నాయి.
Mogali Rekulu: మెగా ఫ్యామిలీతో సందడి చేసిన మొగలిరేకులు ఆర్కే నాయుడు.. వైరల్ అవుతున్న ఫొటోస్..!