స్టార్లు చేసే అడావిడి అంతా ఇంతా కాదు. వాళ్లు ఏది చేసినా సాధారణ మనుషులు చర్చించుకోవలసిందే. వాళ్లు వేసుకునే బట్టల నుంచి తీసుకునే డ్రింక్స్ వరకు అంతా స్పెషలే. వాళ్లు సినిమాలో కనిపించినట్లే.. నిజ జీవితంలో కూడా కాస్ట్లీగా బతుకుతారు. వారు ఏది చేసినా కూడా డిఫరెంట్ గా ఉంటుంది. అందుకే వాళ్లు తినే ఫుడ్ కాడికెళ్లి.. వారు హాలీడేస్ లో వెళ్లే ప్లేస్ వరకు అన్ని కొత్తగా ఉంటాయి. అయితే దాదాపుగా అందరు స్టార్లు కూడా ఒకేలా ఉండేందుకు ఇష్టపడేలా ఉన్నారు.
అది ఎలాగంటే.. వాళ్లు వెకేషన్లకు వెళ్లే ప్రాంతాలను చూస్తే ఇది అర్థమవుతుంది. దాదాపుగా సంపన్నులంతా ఖాళీ దొరికింది అంటే దుబాయ్, మాల్దీవులు లాంటి ప్రాంతాలకు వెళ్తుంటారు. ఈ మధ్య ఈ టూర్లకు తెలుగు సినీ తారలు ఎక్కువగా వెళ్తున్నారు. ఈ మధ్యే సూపర్ స్టార్ మహేష్ బాబు తన కుటుంబంతో దుబాయికి వెళ్లిన సంగతి తెలిసిందే. దీనికి సంబంధించిన ఫొటోలు సోషల్ మీడియాలో హల్ అయ్యాయి.
అలాగే మహేష్ బాబు కూతురు సితార చేసిన పోస్ట్ ట్రెండ్ అయ్యింది. తన తల్లిపై ఎంత ప్రేమ ఉందో అని నెటిజన్లు చేసిన కామెంట్లు కూడా తెలిసినవే. కరోనా కారణంగా సెలబ్రెటిల నుంచి సాధారణ మనుషుల వరకు అందరూ ఇళ్లకే పరిమితమైన విషయం తెలిసిందే. లాక్ డౌన్ అయిపోయాక పలువురు సినీ తారలు వెకేషన్ పేరుమీద పలు ప్రాంతాలను చుట్టేస్తున్నారు. అయితే దుబాయికి వెళ్లిన వారిలో ఎన్టీఆర్ కూడా ఉన్నారు. తన భార్య పిల్లలతో దుబాయికి వెళ్లి వచ్చారు ఆయన.
ఇక మెగా రామ్ చరణ్ తన భార్య ఉపాసనతో కలిసి దుబాయిని చూట్టేసి వచ్చారని వార్తలు వచ్చాయి. అలాగే సమంత, నాగ చైతన్య కూడా మాల్దీవులకు వెళ్లి వచ్చిన సంగతి తెలిసిందే. ఇదే వరుసలో కొత్తగా పెళ్లి చేసుకున్న హీరో నితిన్ కూడా వెకేషన్ కు దుబాయికి వెళ్లాడు. అసలు దుబాయి, మాల్దీవులకు వెళ్లడానికి అసలు కారణం అక్కడ కరోనా తక్కువగా ఉండటమేనని పలువురు చెబుతున్నారు.
అందుకే చాలా మంది సినీ హీరోలు అక్కడకు వెళ్లేందుకు ఆసక్తి చూపిస్తున్నారంట. అందులో భాగంగానే హీరో నితిన్ కూడా తన షూటింగ్స్ లో ఖాళీ దొరికినందుకు దుబాయికి వెళ్లారని సమాచారం. అక్కడ దాదాపుగా వారం రోజులు గడపనున్నారని తెలుస్తుంది. నితిన్ ఇటలీకి హనీమూన్ పోతున్నాడని సోషల్ మీడియాలో ప్రచారం జోరుగా సాగింది. కానీ ఆయన వెళ్లలేదు. అందుకే దుబాయి వెళ్లారని పలువురు అంటున్నారు.
Manasichi Choodu: మేము పెళ్లి కాకముందే అటువంటి పని చేశాము.. మనసిచ్చి చూడు సీరియల్ ఫేమ్ కీర్తి బోల్డ్ కామెంట్స్..!