Guntur Kaaram: సూపర్ స్టార్ మహేష్ బాబు కేరళలో ఫుల్ బిజీగా ఉన్నారు. ఆయన నటించిన “సర్కారు వారి పాట” గత ఏడాది వేసవిలో విడుదల అయింది. ఆ తర్వాత త్రివిక్రమ్ దర్శకత్వంలో “గుంటూరు కారం” అనే సినిమా స్టార్ట్ చేయడం జరిగింది. ఈ సినిమా ప్రకటించిన సమయంలో ఈ ఏడాది ఏప్రిల్ నెలలో విడుదల చేస్తున్నట్లు అధికారికంగా తేదీ విడుదల చేశారు. కానీ షూటింగ్ మొదలెట్టాక పరిస్థితులు మొత్తం తారు మారయ్యాయి. మహేష్ వ్యక్తిగత జీవితంలో తల్లితో పాటు తండ్రిని మరియు అన్నయ్యని కోల్పోవడం జరిగింది. 2022లో మహేష్ మానసికంగా చాలా డ్యామేజ్ అయ్యాడు. ఒకే ఏడాది ముగ్గురు కుటుంబ సభ్యులను కోల్పోవడం తట్టుకోలేకపోయాడు. దీంతో కొన్నాళ్లపాటు “గుంటూరు కారం” సినిమా షూటింగ్ వాయిదా పడటం జరిగింది.
అనంతరం మొదలుపెట్టగా ఏకధాటిగా షూటింగ్ జరుపుకుంటూ ఉంది. వచ్చే ఏడాది సంక్రాంతి పండుగ కానుకగా జనవరి 12వ తారీకు గుంటూరు కారం విడుదల చేయబోతున్నారు. ఈ క్రమంలో ఈ సినిమాకి సంబంధించి షూటింగ్ విషయంలో మహేష్ ఇప్పుడు.. కేరళ వెళ్లడం జరిగిందట. అక్కడ మహేష్ మరియు హీరోయిన్ శ్రీలీలపై… సాంగ్ చిత్రీకరణ చేయబోతున్నారట. ఎట్టి పరిస్థితులలో డిసెంబర్ 20వ తారీకు లోపు సినిమా షూటింగ్ మొత్తం కంప్లీట్ చేయాలని మేకర్స్ స్ట్రాంగ్ గా డిసైడ్ అయ్యారట. దీంతో కేరళలో ఒక సాంగ్ తర్వాత.. సినిమాకి సంబంధించి ప్యాచ్ వర్క్ మొత్తం కంప్లీట్ చేయబోతున్నట్లు టాక్. త్రివిక్రమ్ దర్శకత్వంలో మహేష్ నటిస్తున్నాయి ఈ మూడో సినిమాపై అభిమానులు భారీ అంచనాలు పెట్టుకున్నారు.
గతంలో వీరిద్దరి కాంబినేషన్లో వచ్చిన అతడు, ఖలేజా రెండు కూడా అభిమానులను ఎంతగానో ఆకట్టుకున్నాయి. సినిమాలు హిట్ అవ్వకపోయినా గానీ మహేష్ నటన అందరిని ఆకట్టుకుంది. దీంతో ఇప్పుడు గుంటూరు కారం సినిమా దియాట్రికల్ రైట్స్ 120 కోట్లకు అమ్ముడుపోయినట్టు టాక్ నడుస్తోంది. ఈ సినిమాలో మహేష్ బాబునీ చాలా మాస్ పాత్రలో చూపిస్తున్నారు. గుంటూరు కారం టైటిల్ కి తగినట్టుగానే.. సినిమాలో యాక్షన్ సీన్స్ రేంజ్ లో ఉంటాయని ఇండస్ట్రీ వర్గాలు అంటున్నాయి.