SreeLeela: తెలుగు చలనచిత్ర పరిశ్రమలో 2021 నుండి శ్రీలీల టాప్ హీరోయిన్ గా ఓ వెలుగు వెలుగుతున్న సంగతి తెలిసిందే. పెళ్లి సందడి సినిమాతో ఇచ్చిన ఈ ముద్దుగుమ్మ మొదటి సినిమాతోనే ఆకట్టుకోవడం జరిగింది. ఆ తర్వాత వరుస పెట్టి బ్యాక్ టు బ్యాక్ విజయాలు అందుకుంటూ అగ్ర హీరోల సరసన ప్రస్తుతం నటిస్తూ ఉంది. శ్రీలీల హీరోయిన్ ఇంకా ఎంట్రీ ఇవ్వకముందు సమంత, పూజా హెగ్డే, కాజల్ అగర్వాల్ లాంటివాళ్ళు టాప్ హీరోయిన్ లాగా చలామణి అయ్యారు. వీరిలో కొంతమందికి పెళ్లి కావడం ఆ తర్వాత కరోనా రావటం ఇలా గ్యాపులు రావడంతో ఆ సమయంలో పూజ హెగ్డే టైం నడిచింది. కానీ పూజా హెగ్డే నటించిన చాలా సినిమాలు అట్టర్ ఫ్లాప్ అయ్యాయి.
కరోనా ముందు లక్కీ హీరోయిన్ అనే పేరు ఉండగా కరోనా తర్వాత వచ్చిన పరాజయాలకు ఐరన్ లేగ్ ముద్ర పడింది. ఇలాంటి సమయంలో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చిన శ్రీలీల… వరుస సినిమాలతో దూసుకుపోతోంది. ఈ క్రమంలో పోటీ లేకుండా పోయింది. దీంతో సీనియర్లు మొదలుకొని స్టార్ హీరోల వరకు చాలామంది సినిమాలలో శ్రీలీల హీరోయిన్ గా చలామణి అవుతూ ఉంది. దీంతో నాకు ఇంకా ఎదురు లేదు అన్న విధంగా పరిస్థితి ఉండటంతో ఒక్కసారిగా రెమ్యూనరేషన్ కూడా ఈ ముద్దుగుమ్మ పెంచినట్లు టాక్. కెరియర్ మంచి జోరుగా స్టార్ట్ అయింది అని అనుకున్న శ్రీ లీలాకి ఇప్పుడు మరో కుర్ర హీరోయిన్ చెక్ పెట్టినట్లు సరికొత్త వార్త వినపడుతోంది.
విషయంలోకి వెళ్తే మీనాక్షి చౌదరి అనే హీరోయిన్ కూడా ప్రస్తుతం వరుస పెట్టి అవకాశాలు అందుకుంటూ ఉంది. నందమూరి బాలకృష్ణ హీరోగా బాబీ దర్శకత్వంలో చేస్తున్న సినిమాలో.. సెలెక్ట్ అయినట్టు సరికొత్త వార్త వినపడుతోంది. ఈ ప్రాజెక్టు కాకుండా మరో రెండు ప్రాజెక్టులు ఈ అమ్మడు చేతిలో ఉన్నట్లు ప్రచారం జరుగుతుంది. అంతేకాదు “గుంటూరు కారం” సినిమాలో మహేష్ బాబుతో శ్రీ లీల మెయిన్ హీరోయిన్ గా నటిస్తుండగా అదే సినిమాలో సెకండ్ హీరోయిన్ పాత్రలో మీనాక్షి చౌదరి నటిస్తూ ఉంది. ఈ రకంగా శ్రీలీలకి పోటీగా… కుర్ర హీరోయిన్ మీనాక్షి చౌదరి కూడా అవకాశాలతో దూసుకుపోతున్నట్లు ఇండస్ట్రీలో వార్తలు వైరల్ అవుతున్నాయి.
Aavesham OTT: డిజిటల్ స్ట్రీమింగ్ డేట్ ను కన్ఫామ్ చేసుకున్న ఆవేశం మూవీ.. ఈ రూ. 150 కోట్ల మూవీ స్ట్రీమింగ్ ఎక్కడంటే..!