టాలీవుడ్ ఇండస్ట్రీలో కొత్త సినీ నటులను పరిచయం చేయడంలో ముందుంటాడు డైరెక్టర్ తేజ. ఉదయ్ కిరణ్ మరియు నితిన్ ఇంకా చాలామంది హీరోలను ఆర్టిస్టులను అదేవిధంగా హీరోయిన్లను తేజ పరిచయం చేయడం జరిగింది. ఈ విధంగానే “లక్ష్మీ కళ్యాణం” సినిమా ద్వారా హీరోయిన్ కాజల్ అగర్వాల్ తెలుగు ప్రేక్షకులకు పరిచయమైంది. ఆ తర్వాత “చందమామ” తో అదిరిపోయే విజయం సాధించిన ఈ ముద్దుగుమ్మ ‘మగధీర’ తో ఇండస్ట్రీ హిట్ అందుకుంది. అప్పటి నుండి వెనక్కి తిరిగి చూసుకోకుండా టాలీవుడ్ ఇండస్ట్రీలో దాదాపు బడా హీరోలందరి పక్కన నటించడం జరిగింది.
మధ్యలో కళ్ళు నెత్తికెక్కి సౌత్ ఇండస్ట్రీ పై కాంట్రవర్సీ కామెంట్లు చేసి బాలీవుడ్ ఇండస్ట్రీలో సెటిల్ అయిపోదామని భావించిన కాజల్ అగర్వాల్ కి అక్కడ వరుస ఫ్లాపులు వచ్చాయి. దీంతో యధావిధిగా తనకు లైఫ్ ఇచ్చిన సౌత్ ఇండస్ట్రీ వైపు చూసి ప్రస్తుతం అనేక భాషల్లో హీరోయిన్ గా రాణిస్తుంది. మూడు పదుల వయసు కలిగిన ఈ ముద్దుగుమ్మని డైరెక్టర్ తేజ తన సినిమాలలో హీరోయిన్ గా మొదటి ప్రిఫరెన్స్ ఇవ్వటం ఇండస్ట్రీ లో పెద్ద హాట్ టాపిక్ అయినట్లు వార్తలు వస్తున్నాయి. తేజ కి కాజల్ అగర్వాల్ తప్ప మిగతా హీరోయిన్లు కనబడటం లేదా అని ప్రశ్నిస్తున్నారు. డైరెక్టర్ తేజ ఇటీవల “నేనే రాజు నేనే మంత్రి” ఆ తర్వాత సీత సినిమాలు చేయడం జరిగింది. రెండింటిలోనూ హీరోయిన్ గా కాజల్ అగర్వాల్ నే తీసుకోవడం జరిగింది. ఇదే తరుణంలో నెక్స్ట్ గోపీచంద్ తో “అలిమేలు మంగ వెంకటరమణ” అనే సినిమాను ప్రకటన చేయడం జరిగింది.
సెప్టెంబర్ నెలలో ఈ సినిమా సెట్స్ పైకి వెళ్లనుంది. కాగా ఈ సినిమాలో హీరోయిన్ పాత్ర కోసం మొదటిలో సాయి పల్లవి, కీర్తి సురేష్ పేర్లు వినపడగా తాజాగా మరోసారి కాజల్ అగర్వాల్ వైపు డైరెక్టర్ తేజ ఇంట్రెస్ట్ చూపుతున్నట్లు ఫిలిం నగర్ టాక్. ఇప్పటి వరకు కాజల్ అగర్వాల్ హీరో గోపీచంద్ తో కలిసి నటించిన సినిమాలు లేకపోవడంతో జోడి బాగుంటుందని డైరెక్టర్ తేజ మైండ్ లో ఫిక్స్ అయినట్లు వార్తలు వైరల్ అవుతున్నాయి.
Geetu royal: 5 నెలలుగా నరకం అనుభవిస్తున్న గీతు రాయల్.. కారణం ఇదే..!