Guntur karam: సూపర్ స్టార్ మహేష్ బాబు మనందరికీ సుపరిచితమే. ఎన్నో విజయవంతమైన సినిమాలను చేసిన మహేష్.. మొట్టమొదటిసారి కథని ఎంచుకోవడంలో విఫలమయ్యాడు. తాజాగా త్రివిక్రమ్ దర్శకత్వంలో మహేష్ హీరోగా శ్రీ లీల మరియు మీనాక్షి చౌదరి హీరోయిన్స్ గా తెరకెక్కిన మూవీ ” గుంటూరు కారం “.
ఎన్నో అంచనాలతో రిలీజ్ అయిన ఈ మూవీ భారీ నిరాశ మిగిల్చింది. ఫస్ట్ డే ఫస్ట్ షోకే మిక్స్డ్ టాక్ సొంతం చేసుకుంది. ఇక సంక్రాంతి బరిలో రిలీజ్ అయ్యి దారుణమైన అపజయాన్ని వెలుగు చూసింది. ఇక ఆంధ్రాలో కొన్ని ఏరియాలలో బ్రేక్ ఈవెన్ కూడా కంప్లీట్ చేసుకోవడం గొప్ప విశేషంగా చెప్పుకోవచ్చు.
ముఖ్యంగా షేర్ రూ. 110 కోట్ల వరకు ఉంటుందని ట్రెండ్ పండితులు చెబుతున్నారు. ఇక ఇదిలా ఉంటే తాజాగా ఈ సినిమా గురించి ఓ వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఈ సినిమాలో మహేష్ అత్తగా నటించిన ఈశ్వరి రావ్ మనందరికీ సుపరిచితమే. ఇక ఈమె పాత్రలో ముందుగా ఓ బోల్డ్ హీరోయిన్ ని అప్రోచ్ అయ్యారు. కానీ ఆమె ఈ సినిమాని రిజెక్ట్ చేసిందట.
ఇక ఆమె మరెవ్వరో కాదు హాట్ బ్యూటీ అనసూయ. ప్రస్తుతం పుష్ప సినిమా షూటింగ్లో ఫుల్ బిజీగా ఉన్న అనసూయ.. గుంటూరు కారానికి డేట్స్ ఇవ్వలేక పోయిందట. ఇక దీంతో అనంతరం ఈశ్వరి రావ్ ని అప్రోచ్ అయ్యారట మేకర్స్. ఇక ప్రస్తుతం ఈ వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతుండగా..” రిజెక్ట్ చేసి మంచి పని చేశావు. లేకపోతే నీకు ఇంకా కెరీర్ ఉండేది కాదు ” అంటూ కామెంట్స్ చేస్తున్నారు ప్రేక్షకులు.
Aavesham OTT: డిజిటల్ స్ట్రీమింగ్ డేట్ ను కన్ఫామ్ చేసుకున్న ఆవేశం మూవీ.. ఈ రూ. 150 కోట్ల మూవీ స్ట్రీమింగ్ ఎక్కడంటే..!