RGV Vyooham: వివాదాస్పద డైరెక్టర్ రాంగోపాల్ వర్మ తెరకెక్కించిన “వ్యూహం” సినిమా విడుదలకు మరోసారి హైకోర్టు బ్రేక్ వేయడం జరిగింది. వాస్తవానికి ఈ సినిమా గత ఏడాది డిసెంబర్ నెలలో విడుదల కావాల్సింది. సరిగ్గా విడుదల సమయంలో చంద్రబాబు ప్రతిష్టను దెబ్బతీసేలా రాంగోపాల్ వర్మ “వ్యూహం” సినిమా చిత్రీకరించినట్లు సెన్సార్ సర్టిఫికెట్ రద్దు చేయాలని లోకేష్ తెలంగాణ హైకోర్టులో పిటిషన్ వేయడం జరిగింది. ఈ పిటిషన్ పై విచారణ జరిపిన తెలంగాణ హైకోర్టు సినిమా విడుదలను ఆపేయడం జరిగింది. తాజాగా మరోసారి సెన్సార్ బోర్డ్ సర్టిఫికెట్ సస్పెన్షన్ నీ న్యాయస్థానం పొడిగించింది.
మరో మూడు వారాలు పాటు సస్పెండ్ చేస్తున్నట్లు ఉత్తర్వులు జారీ చేసింది. ఇదే సమయంలో సినిమాలో అభ్యంతరకాల సన్నివేశాలను తొలగించి మరోసారి రివ్యూ చేయాలని సెన్సార్ బోర్డు సభ్యులను తెలంగాణ హైకోర్టు ఆదేశించడం జరిగింది. అనంతరం మూడు వారాల లోపు ఈ సినిమాకి సంబంధించిన కొత్త సెన్సార్ సర్టిఫికెట్ జారీ విషయంలో నిర్ణయం తీసుకోవాలని సూచించింది. ఏపీ సీఎం వైసీపీ అధినేత జగన్ మోహన్ రెడ్డి పొలిటికల్ జీవితంలో చోటు చేసుకున్న సంఘటనలను హైలెట్ చేస్తూ ఈ సినిమా తీయడం జరిగింది. ముఖ్యంగా వైఎస్ జగన్ తండ్రి దివంగత వైయస్ రాజశేఖర్ రెడ్డి చనిపోయిన తర్వాత జరిగిన సంఘటనలను ఆధారం చేసుకుని “వ్యూహం” తెరకెక్కించారు.
అయితే ఈ సినిమాలో పాత్రలు వాస్తవ వ్యక్తుల పేర్లను పోలి ఉండటంతో తీవ్ర స్థాయిలో సినిమాపై విమర్శలు వచ్చాయి. వైసీపీకి అనుకూలంగా రాంగోపాల్ వర్మ వ్యవహరిస్తున్నారని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వివిధ రాజకీయ పార్టీల నాయకులు విమర్శలు చేయడం జరిగింది. ఈ క్రమంలో లోకేష్ తెలంగాణ హైకోర్టును ఆశ్రయించటంతో “వ్యూహం” సినిమా విడుదలకి బ్రేక్ పడింది. ఈ సినిమాకి సంబంధించి ప్రారంభంలో సెన్సార్ బోర్డ్ సర్టిఫికెట్ ఇవ్వలేదు. ఆ సమయంలో ఆర్జీవి అనేక పోరాటాలు చేసి సెన్సార్ సర్టిఫికెట్ తెచ్చుకోవడం జరిగింది. కానీ సినిమాలో చంద్రబాబు ప్రతిష్టతో పాటు పవన్ కళ్యాణ్ ని కించపరిచే విధంగా సన్నివేశాలు ఉన్నాయని లోకేష్ న్యాయస్థానంలో పిటిషన్ వేయడంతో “వ్యూహం” సినిమా విడుదల ఆగిపోయింది.
Family Star OTT Response: థియేటర్లలో అట్టర్ ఫ్లాప్.. ఓటీటీలో టాప్ లో ట్రెండింగ్.. థియేటర్లలోనే ఆడాలా ఏంటి? అంటున్న ఫ్యామిలీ స్టార్..!