కరోనా నుంచి కోలుకున్న వారికి ప్లాస్మా దానం చేసే అద్భుత అవకాశం లభించింది అని టాలీవుడ్ నాచురల్ స్టార్ హీరో నాని అభిప్రాయపడ్డారు. ప్లాస్మా దానం వల్ల మరో ప్రాణాన్ని నిలబెట్టిన వారవుతారు అని సూచించారు. అందుకోసం సైబరాబాద్ పోలీసులు వారధిగా నిలుస్తున్నారని నాని వీడియో సందేశంలో ప్రశంసించారు. వీడియోలో ప్లాస్మా దానం చేయడం వల్ల ఇద్దరి ప్రాణాలను కాపాడగలిగిన వారవుతారని నాని పేర్కొన్నారు.
అంతేకాకుండా దానం చేసిన ప్లాస్మా తిరిగి బాడీలో రెండు మూడు రోజుల్లో తయారవుతుందని, జస్ట్ చిన్న సహాయం చేయడంతో గొప్ప సంతృప్తి ప్లాస్మా దానం చేయడం వల్ల జీవితంలో లభిస్తుంది అని తెలిపారు. కొన్ని కుటుంబాలను ఆదుకునే వారవుతారని నాని ట్విట్టర్లో తన సందేశాన్ని పోస్ట్ చేశారు.
గతంలో ఇదే రీతిలో ప్లాస్మా దానం చేసిన వ్యక్తులను టాలీవుడ్ స్టార్ హీరో విజయ్ దేవరకొండ సన్మానించడం తెలిసిందే. ప్రస్తుతం రెండు తెలుగు రాష్ట్రాల్లో కరోనా విలయతాండవం చేస్తున్న నేపథ్యంలో కరోనా చికిత్స విషయంలో ప్లాస్మా థెరఫీ కీలక భూమిక పోషించడంతో చాలా రాష్ట్ర ప్రభుత్వాలు కూడా ప్లాస్మా దానం చేసే వారికి ఆర్థిక సహాయం చేస్తూ అండగా నిలబడుతున్నాయి.
Manasichi Choodu: మేము పెళ్లి కాకముందే అటువంటి పని చేశాము.. మనసిచ్చి చూడు సీరియల్ ఫేమ్ కీర్తి బోల్డ్ కామెంట్స్..!