Kajal Aggarwal: 2007వ సంవత్సరంలో “లక్ష్మీ కళ్యాణం” సినిమాతో కాజల్ అగర్వాల్ హీరోయిన్ గా తెలుగు ప్రేక్షకులకు పరిచయమైంది. తేజ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రంలో అద్భుతమైన నటనతో మొదటి సినిమాతోనే తెలుగు ప్రేక్షకులకు చేరువయ్యింది. ఆ తర్వాత “మగధీర” సినిమాతో ఇండస్ట్రీ హిట్ అందుకుని స్టార్ హీరోయిన్ స్టేటస్ సంపాదించింది. అప్పటినుండి వరుస పెట్టి బ్యాక్ టు బ్యాక్ సినిమా అవకాశాలు అందుకుని తెలుగు చలనచిత్ర రంగంలో ఆల్మోస్ట్ ఆల్ టాపిక్ హీరోలు అందరి సరసన నటించింది. మెగా కుటుంబంలో మెయిన్ హీరోలు చిరంజీవి, అల్లు అర్జున్, పవన్ కళ్యాణ్, రామ్ చరణ్ లతో నటించింది.
అయితే మధ్యలో బాలీవుడ్ లోకి వెళ్లిన కాజల్ అక్కడ ప్రారంభంలో కొన్ని అవకాశాలు అందుకుని తర్వాత అవకాశాలు రాకపోవడంతో మళ్లీ టాలీవుడ్ బాట పట్టింది. ఆ సమయంలో మెగా హీరోలే ఆదుకోవడం జరిగింది. అయితే పెళ్లయిన తర్వాత ఒక బాబుకి జన్మనిచ్చాక.. కాజల్ సినిమాలకు దూరం కావడం తెలిసిందే. కానీ గత ఏడాది మళ్లీ బాలకృష్ణ నటించిన “భగవంత్ కేసరి” లో అవకాశం అందుకుని మళ్లీ రియంట్రీ ఇచ్చింది. అక్టోబర్ 19వ తారీకు విడుదలైన “భగవంత్ కేసరి” ప్రేక్షకులను అలరించడం జరిగింది. ఈ సినిమాలో హీరోయిన్ గా తన పాత్రకి కాజల్ అగర్వాల్ తగిన న్యాయం చేసింది.
ఇదిలా ఉంటే ఇప్పుడు మెగాస్టార్ చిరంజీవి కొత్త సినిమా మల్లాడి విశిష్ట దర్శకత్వంలో చేయబోయే ప్రాజెక్టులో హీరోయిన్ గా కాజల్ అగర్వాల్ నీ ఎంపిక చేసినట్లు సరికొత్త వార్త వినపడుతోంది. గతంలో మెగాస్టార్ చిరంజీవితో ఖైదీ నెంబర్ 150 సినిమాలో హీరోయిన్ గా చేయడం జరిగింది. ఆ తర్వాత ఆచార్యలో ప్రారంభంలో కాజల్ నీ హీరోయిన్ అనుకున్న తర్వాత ఆమె ప్రాజెక్టు నుండి తప్పుకోవడం జరిగింది. అయితే వశిష్ట సినిమాలో చిరంజీవి సరసన కాజల్ హీరోయిన్ గా అవకాశమందుకున్నట్లు వార్తలు వస్తున్నాయి. “భగవంత్ కేసరి”లో లుక్స్ బాగుండటంతో ఆమెకు ఈ అవకాశం ఇచ్చినట్లు ఫిలింనగర్ టాక్.