RRR Climax : దర్శకధీరుడు రాజమౌళి త్రిబుల్ ఆర్ సినిమా గురించి దేశం మొత్తం ఎంతో ఆతృతగా ఎదురు చూస్తోంది.ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్న ఈ సినిమాలో స్టార్ హీరోలైన రామ్ చరణ్, ఎన్టీఆర్ నటిస్తున్న విషయం తెలిసినదే. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకుని హైదరాబాద్ లో క్లైమాక్స్ చిత్రీకరణ జరుపుకుంటోంది. అయితే క్లైమాక్స్ ను తెరకెక్కించే విషయంలో రాజమౌళి విభిన్నంగా తెరకెక్కిస్తున్నట్లు సమాచారం. ఒకప్పుడు సినిమాలలో క్లైమాక్స్ లో హీరో చనిపోతే జనాలు పెద్దగా ఆదరించే వారు కాదు. కానీ ప్రస్తుతం జనాల ఆలోచన విధానం మారింది. కథ బాగుంటే చాలు వారి ఎలాంటి సన్నివేశాలు నైనా స్వీకరించడానికి సిద్ధంగా ఉన్నారని ఎన్నో సినిమాలు నిరూపించుకున్న.
రాజమౌళి తెరకెక్కించిన విక్రమార్కుడు, మగధీర, బాహుబలి వంటి ఎంతో విజయవంతమైన సినిమాల్లో హీరోలు చనిపోయే సన్నివేశాలను ఎంతో ఎమోషనల్ గా చిత్రీకరించారు. అయితే ఇదే ఫార్ములాను జక్కన్న త్రిబుల్ ఆర్ సినిమాలో వాడబోతున్నారా? అంటే అవుననే చెబుతున్నారు సినీ వర్గాలు. త్రిబుల్ ఆర్ సినిమాలో కూడా హీరోలు చనిపోకపోయిన వారికి అంగవైకల్యం ఏర్పడే సన్నివేశాలు ఉంటాయనే సమాచారం తెలుస్తోంది.
త్రిబుల్ ఆర్ దేశభక్తి సినిమా కాదు:
ఈ సినిమాలో అల్లూరి సీతారామరాజు, కొమరం భీమ్ బ్రిటిష్ వారితో పోరాటం చేస్తున్న సమయంలో రామ్ చరణ్ తేజ్ కాళ్లు కోల్పోతారని, ఎన్టీఆర్ కళ్ళు కోల్పోయి అంగవైకల్యంతో బాధపడతారని తెలుస్తోంది. అయితే అందరూ అనుకునే విధంగా ఈ సినిమా దేశభక్తి సినిమా కాదని, స్నేహ బంధాన్ని చాటిచెప్పే సినిమాగా ఉంటుందని దర్శకుడు తెలియజేశారు.క్లైమాక్స్లో కళ్లు, కాళ్లు పోయినా కూడా ట్రాజిక్ క్లైమాక్స్లా కాకుండా చాలా ఎమోషనల్గా తెరకెక్కించే ప్రయత్నం చేస్తున్నాడు.సినిమా విడుదలకు ముందు ఈ విధంగా క్లైమాక్స్ ట్విస్ట్ చెప్పడంతో ప్రేక్షకులు ఏ విధంగా ఆదరిస్తారని విషయాన్నితెలుసుకొని క్లైమాక్స్ లో ఇలాంటి సన్నివేశాలు ఉంచాలా వద్దా అన్న ఆలోచనలో దర్శకుడు ఉన్నట్లు తెలుస్తోంది.
Manasichi Choodu: మేము పెళ్లి కాకముందే అటువంటి పని చేశాము.. మనసిచ్చి చూడు సీరియల్ ఫేమ్ కీర్తి బోల్డ్ కామెంట్స్..!