Urvasivo Rakshasivo: గీత ఆర్ట్స్ బ్యానర్ లో తెరకెక్కిన ‘ఊర్వశివో రాక్షసివో’ నవంబర్ 4వ తారీఖు విడుదల కానుంది. అల్లు శిరీష్, అను ఇమ్మానియేల్ జంటగా నటించిన ఈ సినిమా ప్రీ రిలీజ్ వేడుక హైదరాబాద్ లో చాలా గ్రాండ్ గా జరిగింది. ఈ కార్యక్రమానికి నటసింహం నందమూరి బాలయ్య బాబు ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా అల్లు శిరీష్ మాట్లాడుతూ.. ఈ కార్యక్రమానికి చాలా మాట్లాడాలని ఇంటి దగ్గర బాగా ప్రిపేర్ అయి వచ్చాను. కానీ నటసింహం నందమూరి బాలకృష్ణ గారిని చూశాక మొత్తం మరిచిపోయాను. ఎదురుగా ఆయనని చూస్తూ ఉండేసరికి ప్రిపేర్ అయ్యింది మొత్తం మరిచిపోయాను. బయట అంతకముందు రెండుసార్లు బాలకృష్ణ గారిని చాలా దగ్గరగా చూశాను. ఆయన ఎనర్జీ లెవెల్స్ చూసి ఆ టైంలో షాక్ అయ్యాను.
“మహా నాయకుడు” సినిమాలో నిత్య యవ్వనస్తుడు అనే డైలాగ్ ఉంటుంది. సరిగ్గా అది బాలయ్య బాబు గారికి సూట్ అవుద్ది. ఆ రేంజ్ లో ఆయన ఎనర్జీ లెవెల్స్ ఉంటాయి. మా ఇంటిలో ఓ కార్యక్రమానికి అదే విధంగా చిరంజీవి గారి 60వ జన్మదినోత్సవం వేడుకలలో అందరం బాగా ఎంజాయ్ చేశాం. కానీ చివరాఖరికి అందరం అలసిపోయాం… కానీ బాలకృష్ణ గారు మాత్రం అదే రేంజ్ లో ఇంకా ఎంజాయ్ చేస్తూనే ఉన్నారు. అప్పటినుండి నేను బాలకృష్ణ గారికి బాగా ఇంప్రెస్ అయ్యాను. ఈ క్రమంలో సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ కి ఆయనని పిలవాలని చాలాసార్లు అనుకున్నాను. కానీ అడిగి మళ్ళీ వద్దు అంటారేమో…కొద్దిగా నామోశి అనిపించింది. అదే సమయంలో బాలకృష్ణ గారు పెద్దగా బయటికి రారు. అందువల్ల ఆయనని అడగాలా వద్దా అనే విషయంలో చాలా సార్లు ఆలోచన చేశాను. ఇక ఆయనపై ఇష్టంతో ఏదో విధంగా సాహసం చేసి మరి అడిగాను.
నిజంగా ఆయన ఈ వేడుకకు రావడం నా అదృష్టం. ఆయన ఆశీస్సులు ఉండాలని సినిమా విజయం సాధించాలని కోరుకుంటున్నాను అని అల్లు శిరీష్ కీలక వ్యాఖ్యలు చేయడం జరిగింది. ఇక డైరెక్టర్ రాకేష్ శశి.. మంచి టాలెంట్ కలిగిన దర్శకుడు. ఎవరి దగ్గర ఏ రీతిలో టాలెంట్ రాబట్టుకోవాలో ఆయనకి బాగా తెలుసు. అది సినిమా చూశాక అర్థం అవుతుంది. ఇక ఈ సినిమాలో వెన్నెల కిషోర్, సునీల్, ఆమని మరి కొంతమంది సీనియర్ ఆర్టిస్టులతో కలిసి పనిచేయడం చాలా అదృష్టంగా భావిస్తున్నాను. ఇంకా హీరోయిన్ అను ఇమ్మానుయేల్ గురించి చెప్పాలంటే మేడమ్ సార్ .. అంతే. నా కోసమే కాదు .. తన కోసం కూడా ఈ సినిమా హిట్ కావాలని కోరుకుంటున్నాను” అంటూ చెప్పుకొచ్చాడు.
Baahubali: సరికొత్త కథతో ఓటీటీలోకి వచ్చేస్తున్న బాహుబలి.. రిలీజ్ డేట్ ఇదే..!