Vijay 66: తమిళ స్టార్ హీరో తలపతి విజయ్ తెలుగులో ఎంట్రీ ఇస్తున్న తాజా చిత్రం నేడు ఘనంగా ప్రారంభమయింది. వరుస విజయాలతో మంచి ఊపు మీదుతున్న విజయ్ గత చిత్రం మాస్టర్తో పాన్ ఇండియన్ స్టార్గానూ క్రేజ్ సంపాదించుకున్నాడు. విజయ్కు మాస్ హీరోగా తమిళంతో పాటు తెలుగులోనూ మంచి క్రేజ్ ఉంది. దాంతో గత కొన్నేళ్ళుగా ఈ కోలీవుడ్ స్టార్ టాలీవుడ్లో స్ట్రైట్ సినిమాతో ఎంట్రీ ఇవ్వాలని ట్రై చేస్తున్నాడు. ఎట్టకేలకు ఇప్పుడు కుదిరింది. అది కూడా టాలీవుడ్ స్టార్ ప్రొడ్యూసర్ దిల్ రాజు సంస్థలో తన తెలుగు డెబ్యూ చేస్తుండటం విశేషం.
ఇక ఈ ఏడాది ప్రారంభం నుంచి ఇదిగో అదిగో అంటూ చెప్పుకొస్తున్న ఈ సినిమా నాలుగు నెలలైనా ప్రకటన రాకపోయేసరికి క్యాన్సిల్ అయిందని కూడా వార్తలు వచ్చాయి. అయితే ఇటీవల హీరోయిన్ రష్మిక మందన్న ఈ క్రేజీ ప్రాజెక్ట్లో హీరోయిన్గా నటిస్తున్నట్టు అధికారి కంగా ప్రకటించి ప్రాజెక్ట్పై ఫుల్ క్లారిటీ ఇచ్చేశారు. కాగా, నేడు ఈ భారీ చిత్రాన్ని పూజా కార్యక్రమాలతో ఘనంగా ప్రారంభించారు. ఈ సినిమా ప్రారంభోత్సవం చైన్నైలో నిర్వహించారు.
నిర్మాత దిల్ రాజు హీరో హీరోయిన్లపై క్లాప్ కొట్టారు. పాన్ ఇండియన్ స్థాయిలో ఈ సినిమాను దిల్ రాజు భారీ బడ్జెట్తో నిర్మిస్తున్నారు.
Vijay 66: ముందుగా పాట చిత్రీకరణను పూర్తి చేయనున్నారు.
కాగా, పూజా కార్యక్రమాలతోనే మూవీ రెగ్యులర్ షూటింగ్ కూడా ప్రారంభిస్తున్నారు. ముందుగా పాట చిత్రీకరణను పూర్తి చేయనున్నారు. ఇక ఈ కార్యక్రమానికి విజయ్, రష్మిక మందన్నలతో పాటుగా మ్యూజిక్ డైరెక్టర్ ఎస్ ఎస్ థమన్, దర్శకుడు వంశీ పైడిపల్లి, దిల్ రాజుతో ఇతర సిబ్బంది పాల్గొన్నారు. మరి మహేశ్ బాబు రిజెక్ట్ చేసిన ఈ కథతో తెలుగు డెబ్యూ చేస్తున్న కోలీవుడ్ హీరో విజయ్ ఏ రేంజ్ హిట్ అందుకుంటాడో చూడాలి. కాగా, ఈ నెల 13న విజయ్, పూజా హెగ్డే నటించిన బీస్ట్ సినిమా భారీ స్థాయిలో రిలీజ్ కాబోతోంది. నెల్సన్ దిలీప్ కుమార్ దర్శకత్వం వహించిన ఈ సినిమాను సన్ పిక్చర్ సంస్థ భారీ బడ్జెట్తో నిర్మిస్తోంది.
Geetu royal: 5 నెలలుగా నరకం అనుభవిస్తున్న గీతు రాయల్.. కారణం ఇదే..!