Yatra 2: 2019 ఎన్నికల సమయంలో డైరెక్టర్ మహి.వి రాఘవ తీసిన యాత్ర సినిమా చాలా ప్రభావం చూపించడం జరిగింది. వైయస్ రాజశేఖర్ రెడ్డి పాదయాత్ర ఆధారం చేసుకుని తెరకెక్కిన ఈ చిత్రం వైసీపీ పార్టీకి వైఎస్ జగన్ కి మంచి మైలేజ్ తీసుకురావడం జరిగింది. వైయస్ పాత్రలో మమ్ముట్టి అద్భుతంగా నటించటం జరిగింది. వైయస్ పాదయాత్ర కాంగ్రెస్ పార్టీకి అప్పట్లో పునర్జీవం తీసుకురావడం తెలిసిందే. అంతేకాదు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి కూడా తీసుకురావడం జరిగింది. ఇదంతా పక్కన పెడితే ఇప్పుడు డైరెక్టర్ మహి.వి రాఘవ సోషల్ మీడియాలో కీలక ప్రకటన చేశారు.
జులై 8 వ తారీకు వైయస్ జయంతి నాడు యాత్ర రెండో భాగం ప్రాజెక్టు ప్రకటన ఉంటుందని హింట్ ఇచ్చేటట్లు స్పష్టం చేయడం జరిగింది. తన ట్విట్టర్ ఎకౌంట్లో జులై 8.. 2023 అంటూ ట్వీట్ చేశారు. దీంతో ఆరోజు వైఎస్ జయంతి సందర్భంగా “యాత్ర 2” ఉంటుందని అందరూ అంచనా వేస్తున్నారు. ఇటీవల డైరెక్టర్ మహి.వి రాఘవ దర్శకత్వంలో తెరకెక్కిన “సైతాన్” సిరీస్ ప్రమోషన్ కార్యక్రమంలో భాగంగా “యాత్ర 2” ఉంటుందని ప్రకటించడం జరిగింది. ఈ సీక్వెల్ లో వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి పాదయాత్ర నుంచి మొదలై ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసే వరకు …. స్టోరీ ఉండబోతుందని ఇంటర్వ్యూలో తెలియజేశారు.
తాజా ట్వీట్ తో వైసీపీ శ్రేణులల్లో సంతోషం నెలకొంది. అయితే ఈ సినిమా ఈ నెలలో మొదలయ్యి ఫిబ్రవరి నెలలో విడుదల అయ్యేలా దర్శకుడు ప్లాన్ చేస్తున్నరు. పరిస్థితి ఇలా ఉండగా తాజాగా ఫిబ్రవరి నెలలో సినిమా రిలీజ్ చేయబోతున్నట్లు ఓ పోస్టర్ కూడా రిలీజ్ చేసి దాని మీద “నేనెవరో ఈ ప్రపంచానికి ఇంకా తెలియకపోవచ్చు కానీ ఒకటి గుర్తుపెట్టుకోండి నేను వైయస్ రాజశేఖర్ రెడ్డి కొడుకుని” అంటూ.. డైలాగ్ తరహాలో రాసుకురావడం జరిగింది. సరిగ్గా 2024 ఎన్నికలకు ముందు ఈ సినిమా విడుదల అయ్యేలా డైరెక్టర్ మహి.వి రాఘవ ప్లాన్ చేస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. వైయస్ జగన్ పాత్రలో.. తమిళ నటుడు జీవా నటించబోతున్నట్లు సమాచారం.
Family Star OTT Response: థియేటర్లలో అట్టర్ ఫ్లాప్.. ఓటీటీలో టాప్ లో ట్రెండింగ్.. థియేటర్లలోనే ఆడాలా ఏంటి? అంటున్న ఫ్యామిలీ స్టార్..!