Judge : మధ్యప్రదేశ్ లో కాంగ్రెస్ నాయకుడైన దేవేంద్ర చౌరాసియా మర్డర్ కేసు ను పరిశీలిస్తున్న డిస్ట్రిక్త్ అడిషనల్ జడ్జి చేసిన సంచలన వ్యాఖ్యలు ఇప్పుడు దేశవ్యాప్తంగా దుమారం రేపాయి. మధ్యప్రదేశ్ లోని హట్టా డిస్టిక్ అడిషనల్ జడ్జ్ అయిన ఆర్.పి సొంకర్ తన పై దామోహ్ డిస్ట్రిక్ పోలీస్ సూపరిండెంట్ నుండి విపరీతమైన ఒత్తిడి ఉన్నట్లు తెలిపారు.
అంతేకాకుండా ఈ కేసులో తీర్పు ఏమాత్రం అటూ ఇటూ గా వచ్చినా తన ప్రాణాలకే ముప్పు ఉంది అన్నట్లు సొంకర్ ప్రస్తావించడం గమనార్హం. వివరాల్లోకి వెళితే… మధ్య ప్రదేశ్ కాంగ్రెస్ నాయకుడైన దేవేంద్ర చౌరాసియా హత్యకేసులో బీఎస్పీ పార్టీ ఎమ్మెల్యే రామ్ భాయ్ ఠాకూర్ భర్త అయినటువంటి గోవింద్ సింగ్ ప్రధాన నిందితుడిగా పరిగణింపబడ్డాడు. అయితే జడ్జి సొంకర్ మాట్లాడుతూ పోలీస్ సూపరిండెంట్ నిందితుడితో కలిసి తనను బెదిరిస్తున్నట్లు చెప్పారు. అంతే కాకుండా ఎస్పీ తన సబ్ ఆర్డినేట్స్ కలిపి తనపై లేనిపోని కేసులు పెట్టేందుకు కూడా వెనుకాడడని సొంకర్ చెప్పడం గమనార్హం.
దీంతో జడ్జి ఈ కేసు హియరింగ్ ను కూడా బదిలీ చేయమని కోరారు. దేవేంద్ర మర్డర్ కేసులో బీఎస్పీ ఎమ్మెల్యే భర్తతో పాటు ఆమె దగ్గర బంధువులు కూడా కేసులో నిందితులుగా ఉన్నారు. అయితే పోలీస్ స్టేట్మెంట్ చూసినప్పుడు మాత్రం పోలీసులు అనుమానితుడు లేదా నిందితుడికి అరెస్టు వారెంట్ ఇచ్చే విషయంలో వారు నియమాలు అతిక్రమించిన్నట్లు ఏకంగా జడ్జి ప్రస్తావించడం గమనార్హం.
అంతేకాకుండా నిందితుడైన గోవింద్ సింగ్ ను హాజరుపరిచే క్రమంలో కూడా పోలీసులు అతనికి సహకరిస్తున్నారని అసలు అరెస్టు వారెంటు కు సంబంధించిన ఏ ఒక్క నియమం కూడా వారు పాటించటం లేదని చెప్పారు. ఈ విషయమై తాను కోర్టులో నిలదీస్తే తనకే బెదిరింపులు వస్తున్నాయని భవిష్యత్తులో తనకు ఏదైనా జరగవచ్చు అని విచారం వ్యక్తం చేశారు. ఇక ఈ విషయాన్ని ప్రభుత్వం సీరియస్ గా తీసుకొని పోలీసు ఉన్నతాధికారులను విచారణ కు ఆదేశించాలని ఆయన కోరారు.