Nellore Court Theft Case: కోర్టులో దొంగతనం చేశారు.. ఓ కేసుకి సంబంధించిన ఆధారాలు, సాక్ష్యాలు పట్టుకుపోయారు.. కోర్టు సమీపంలోనే ధ్వంసం చేసి పడేసారు.. అది మంత్రికి సంబందించిన కేసు పత్రాలని తేలింది..! “అధికార పార్టీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి .. నాడు ప్రతిపక్షంలో ఎమ్మెల్యేగా ఉండగా.. తనకు ప్రత్యర్థి అయిన సోమిరెడ్డి అక్రమాస్తులు కూడగట్టారంటూ పత్రికా సమావేశంలో చూపిన పత్రాలు నకిలీవని సోమిరెడ్డి కేసు పెట్టడంతో పాటూ.., పరువు నష్టం దావా కేసు కూడా వేశారు.. నాడు అవి నకిలీవేనని గుర్తించిన పోలీసులు కోర్టుకి చార్జిషీట్ కూడా వేసారు..” ఆ కేసుకి సంబందించిన పత్రాలు నిన్న చోరీకి గురయ్యాయి..! అయినా కోర్టులో దొంగతనం అంటే వ్యవస్థకు ఎంత చెడ్డ పేరు, వ్యవస్థకు ఎంత పెద్ద మచ్చ..! అందుకే పోలీసులు వెంటనే రంగంలోకి దిగారు.
Nellore Court Theft Case: సీరియస్ గా దర్యాప్తు.. కానీ..!?
జిల్లా కోర్టు సముదాయంలో చోరీ వ్యవహారంలో పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు. ఆరుగురు చోరీ చేసినట్లు సీసీ కెమెరాల ద్వారా గుర్తించిన పోలీసులు.. ఇద్దరిని అదుపులోకి తీసుకున్నారు. నిందితుల్లో ఓ కానిస్టేబుల్, కోర్టు ఉద్యోగి ఉన్నట్లు తెలుస్తుండగా.. మిగతా వారి కోసం గాలిస్తున్నారు. ఇది అసలు ట్విస్టు.. కోర్టు ఉద్యోగి, ఒక కానిస్టేబుల్ సహా కొందరు వ్యక్తులు కలిసి కోర్టుకే కన్నం వేశారు. ఆ మంత్రికి చెందిన కేసు పత్రాలు లేకుండా చేస్తే కేసు నీరుగారిపోతుందని ఈ దారుణమైన \తతంగానికి పాల్పడ్డారు.. ఇక్కడ అధికార ఒత్తిడితో పోలీసులు సరిగా దర్యాప్తు చేయకపోయినా.. కోర్టులు చూస్తూ ఊరుకోవు. దేశంలోనే మొదటిసారి కాబట్టి హైకోర్టు.. లేదా సుప్రీమ్ కోర్టు తలదూర్చి డీజీపీ స్థాయిలో వివరణ కోరినా ఆశ్చర్యం అవసరం లేదు. సో.. ఈ కేసు మరో సంచలనంగా మారబోతున్నట్టుగా చెప్పుకోవచ్చు..! దీనిపై ఆల్రెడీ టీడీపీ దూకుడుని మొదలు పెట్టగా.. ఆరోపణలు ఎదుర్కొంటున్న మంత్రి కాకాని మౌనం వహించారు. ఆయనను రాజకీయంగా ఈ కేసు, ఈ చోరీ వ్యవహారం ఇబ్బంది పెట్టేదే..!