అమరావతి, మార్చి 6: ఆంధ్రప్రదేశ్ నూతన ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా ఎల్ వి సుబ్రమణ్యం శనివారం బాధ్యతలు స్వీకరించారు. ముందుగా ఆయన కుటుంబ సమేతంగా విజయవాడ కనకదుర్గమ్మ అమ్మ వారిని దర్శించుకొని ప్రత్యేక పూజలు నిర్వించారు. నూతన సిఎస్ గా బాధ్యతలు స్వీకరించనున్న ఎల్ వి సుబ్రమణ్యం కు ఆలయ మర్యాదలతో అధికారులు స్వాగతం పలికారు. అమ్మవారి దర్శనం, ప్రత్యేక పూజల అనంతరం అర్చకులు, వేదపండితులు శేషవస్త్రాలతో సత్కరించి ఆశీర్వచనాలు అందించారు. తదుపరి ఎల్ వి సుబ్రమణ్యం సచివాలయానికి చేరుకుని బాధ్యతలు స్వీకరించారు.
ఇప్పటి వరకూ సిఎస్ గా ఉన్న అనిల్ చంధ్ర పునేఠను కేంద్ర ఎన్నికల సంఘం బదిలీ చేసి 1982 బ్యాచ్ కు చెందిన ఐఎఎస్ అధికారి ఎల్ వి సుబ్రమణ్యాన్ని నూతన సిఎస్ గా నియమించిన సంగతి తెలిసిందే.