సూపర్ స్టార్ మహేష్ బాబు తన కెరీర్ లో 27 వ సినిమాగా సర్కారు వారి పాట చేయబోతున్నాడు. జనవరి నుంచి ఈ సినిమా అమెరికాలో లాంగ్ షెడ్యూల్ జరుపుకునేందుకు ప్లాన్ చేస్తున్నారు. కీర్తి సురేష్ హీరోయిన్ గా నటిస్తుండగా జి.ఎం.బి.ఎంటర్టైన్మెంట్స్, 14 రీల్స్ ఎంటర్టైన్మెంట్స్, మైత్రీ మూవీ మేకర్స్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. పరశురాం ఈ సినిమాకి దర్శకత్వం వహిస్తుండగా థమన్ సంగీతమందిస్తున్నాడు.
ఇక ఈ సినిమా తర్వాత మహేష్ బాబు రాజమౌళి తో ఒక భారీ పాన్ ఇండియన్ సినిమా చేయనున్నాడు. ఈ సినిమాకి సంబంధించి ఇప్పటికే రాజమౌళి, మహేష్ బాబు వెల్లడించారు కూడా. అయితే ప్రస్తుతం ఎన్.టి.ఆర్ రాజమౌళి దర్శకత్వంలో ఆర్ ఆర్ ఆర్ చేస్తున్నాడు. ఈ సినిమా తర్వాత ఎన్టీఆర్ త్రివిక్రమ్ దర్శకత్వంలో ఒక సినిమా చేసేందుకు ఇప్పటికే సన్నాహాలు జరుగుతున్నాయి. హాసిని అండ్ హారిక క్రియోషన్స్, ఎన్టీఆర్ ఆర్ట్స్ ఈ సినిమాని సంయుక్తంగా నిర్మించబోతున్నారు. ఎన్టీఆర్ కెరీర్ లో 30 వ సినిమాగా రూపొందబోతుండగా పాన్ ఇండియన్ సినిమాగా తెరకెక్కించబోతున్నారు త్రివిక్రం. ప్రస్తుతానికి ఈ సినిమాకి అయినను పోయిరావలె హస్తిన కు అన్న టైటిల్ ప్రచారం లో ఉంది.
అయితే సోషల్ మీడియాలో ఆర్ ఆర్ ఆర్ కంప్లీట్ అవడానికి ఇంకా చాలా సమయం పడుతుంది కాబట్టి ఈ లోపు త్రివిక్రమ్ మరో సినిమా చేసేందుకు సన్నాహాలు చేసుకుంటున్నారన్న వార్తలు గత కొన్ని రోజులుగా వస్తున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే మహేష్ బాబు తో త్రివిక్రమ్ నెక్స్ట్ సినిమా ఉంటుందని అంటున్నారు. అంతేకాదు ఇందుకు సంబంధించిన ప్రకటన త్రివిక్రం బర్త్ డే రోజు అయిన నవంబర్ 7 న రానుందని అన్నారు. కాని ఈరోజు అలాంటి ప్రకటన ఏదీ రాలేదు. అంటే మహేష్ బాబు తో త్రివిక్రమ్ సినిమా ఇప్పట్లో లేనట్టే అని క్లారిటి వచ్చినట్టే.