ప్రముఖ దర్శకుడు, ఎడిటర్.. టి.కృష్ణ గారి వారసుడిగా తొలి వలపు అన్న సినిమాతో టాలీవుడ్ కి పరిచయమయ్యాడు గోపీచంద్. మొదటి సినిమాతో హీరోగా మంచి పేరే వచ్చినప్పటికి ఆ తర్వాత మళ్ళీ అవకాశం రాలేదు. చాలా ఏళ్ళకి ప్రముఖ దర్శకుడు తేజ నితిన్ తో తెరకెక్కించిన జయం సినిమాతో విలన్ గా మళ్ళీ ఎంట్రీ ఇచ్చాడు. ఈ సినిమా బ్రేక్ ఇవ్వడంతో వరసగా నిజం, వర్షం సినిమాలు చేశాడు. ఈ రెండు సినిమాలతో బాగా పేరు తెచ్చుకున్నాడు.
ఆ తర్వాత మళ్ళీ హీరోగా యజ్ఞం సినిమాలో నటించగా ఆ సినిమా సూపర్ హిట్ గా నిలిచింది. అంతే ఇక గోపీచంద్ మళ్ళీ వెనక్కి తిరిగి చూసుకోలేదు. వరసగా చేసిన సినిమాలన్ని మంచి సక్సస్ లు సాధించాయి. యాక్షన్ హీరోగా పాపులారిటీని సాధించాడు. తనకంటూ మంచి మార్కెట్ ని ఏర్పరచుకున్నాడు. అయితే ఈ మధ్య కాలంలో గోపీచంద్ కి సరైన హిట్ దక్కడం లేదు. గత కొన్నేళ్లుగా వరస ప్లాపులతో గోపీచంద్ కెరీర్ ఇబ్బందుల్లో పడింది.
ప్రస్తుతం సంపత్ నంది దర్శకత్వంలో సీటిమార్ అన్న సినిమా మాత్రమే గోపీచంద్ చేతిలో ఉంది. ఈ సినిమా స్పోర్ట్స్ బ్యాక్ డ్రాప్ లో సాగే యాక్షన్ ఎంటర్టైనర్ గా తెరకెక్కుతుంది. దాదాపు 30 శాతం షూటింగ్ పూర్తయిన ఈ సినిమాలో తమన్న హీరోయిన్ గా నటిస్తుండగా వచ్చే నెల నుండి రెగ్యులర్ షూటింగ్ తిరిగి మొదలవబోతుంది. ఇక ఈ సినిమాలో హీరో హీరోయిన్స్ ఇద్దరు కబడ్డీ కోచ్ లు గా నటిస్తున్నారు.
అయితే గోపీచంద్ గత సంవత్సరం ప్రముఖ నిర్మాత బివిఎస్ఎన్ ప్రసాద్ నిర్మాణంలో ఒక సినిమా కమిటయ్యాడు. ఈ సినిమాని నూతన దర్శకుడు బిను సుబ్రహ్మణ్యం తెరకెక్కిస్తారని అధికారికంగా వెల్లడించారు కూడా. ఘనంగా సినిమా పూజా కార్యక్రమాలు నిర్వహించారు. కాని ఈ సినిమా పట్టాలెక్కలేదు. ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో ఈ సినిమా క్యాన్సిల్ అయినట్టు తెలుస్తుంది. దాంతో గోపీచంద్ తీసుకున్న 2 కోట్ల అడ్వాన్స్ ను నిర్మాత బివిఎస్ఎన్ ప్రసాద్ కు తిరిగి ఇచ్చేశాడట. సాధారణంగా ఇలా జరగడం చాలా అరుదు. కాని గోపీచంద్ ఈ విషయంలో తోపు అనిపించుకున్నాడు. ఇక సీటిమార్ పూర్తయ్యాక తేజ దర్శకత్వంలో అలివేలు మంగ వెంకటరమణ అన్న టైటిల్ తో సినిమా చేయబోతున్నాడు గోపీచంద్.
Mogalirekulu: నీకెంతా బలుపు రా?.. మొగలిరేకులు ఫేమ్ ఆర్కే నాయుడు పై సీనియర్ నటి ఫైర్..!