NTR: యంగ్ టైగర్ ఎన్టీఆర్ ఒకపక్క సినిమా రంగంలో రాణిస్తూ మరోపక్క బుల్లితెరపై సత్తా చాటడానికి రెడీ అవుతున్నారు. ప్రస్తుతం రాజమౌళి దర్శకత్వంలో “RRR” ఫినిషింగ్ వర్క్ లో ఉన్న ఎన్టీఆర్ త్వరలో కొరటాల ప్రాజెక్ట్ స్టార్ట్ చేయనున్నారు. కొరటాల సినిమా చేస్తుండగానే “మీలో ఎవరు కోటీశ్వరుడు” అనే కార్యక్రమం చేయటానికి ఎన్టీఆర్ సిద్ధమయ్యారు. దాదాపు వరుస పెట్టి ఈ కార్యక్రమానికి సంబంధించి ఎపిసోడ్స్ పూర్తి చేయాలని, ఒక్కో ఎపిసోడ్ కోసం ఎన్టీఆర్ భారీ ఎత్తున రెమ్యూనరేషన్ తీసుకుంటున్నట్లు తెలుస్తోంది.
ఇదిలా ఉంటే గతంలో బిగ్ బాస్ సీజన్ వన్ కి హోస్ట్ గా ఎన్టీఆర్ చేసిన సమయంలో టిఆర్పి రేటింగ్ లో రికార్డు స్థాయిలో నమోదు అయ్యాయి. ఇప్పుడు అదే తరహాలో టిఆర్పి రేటింగ్ లో రికార్డులు క్రియేట్ అయ్యేలా ఆగస్టు 15వ తారీకు నుండి ఈ షో.. ప్రారంభం కానున్నట్లు సమాచారం. స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా జెమినీ టీవీలో ఈ షో ప్రసారం కానున్నట్లు తెలుస్తోంది.
Read More: NTR 30 : ఎన్టీఆర్ కెరీర్లో మైల్ స్టోన్ మూవీ ఎన్టీఆర్ 30
ఇప్పటికే కొన్ని ఎపిసోడ్ లకి సంబంధించి షూటింగ్ జరిగినట్లు సమాచారం. అంతేకాకుండా ఈ షో కి ఫస్ట్ చీఫ్ గెస్ట్ గా రామ్ చరణ్ రానున్నట్లు ఇప్పటికే వార్తలు వచ్చాయి. చరణ్ ఎన్టీఆర్ కలిసి RRR చేయడంతో సినిమాకి ప్రమోషన్ వస్తుందన్న ఆలోచనతో ఎన్టీఆర్ ఈ ప్లాన్ చేసినట్లు సోషల్ మీడియాలో టాక్. ఏది ఏమైనా వెండి తెరపై కనిపించే పరిస్థితులు ఇటీవల లేకపోవటంతో బుల్లితెరపై ఎన్టీఆర్ ప్రత్యక్షమవుతూ ఉండటంతో నందమూరి అభిమానులు.. ఫుల్ హ్యాపీగా ఉన్నారు.