పవన్ కళ్యాణ్ గెలిచి చట్టసభల్లో అడుగుపెట్టే గెలుపు సీటుకు ఇప్పుడు దారి కావాల్సి వచ్చింది. పవన్ కళ్యాణ్ జనసేన పార్టీ పెట్టి పదేళ్లు అవుతుంది. 2014 ఎన్నికల సమయంలో జనసేన పార్టీ పెట్టిన పవన్ ఆ ఎన్నికల్లో పోటీకి దూరంగా ఉండి తెలుగుదేశం – బిజెపి కూటమికి సపోర్ట్ చేశారు. ఐదేళ్ల తర్వాత 2019 ఎన్నికలకు వచ్చేసరికి రెండు పార్టీలకు దూరంగా జరిగి ఒంటరిగా పోటీ చేశారు. గత అసెంబ్లీ ఎన్నికలలో జనసేన కేవలం రాజోలులో మాత్రమే గెలిచింది. రాజోలు నుంచి జనసేన ఎమ్మెల్యేగా రాపాక వరప్రసాదరకు విజయం సాధించారు.
అది కూడా కేవలం 700 వాట్ల స్వల్ప తేడాతో మాత్రమే ఆయన గెలిచారు. ఆ తర్వాత కొంతకాలానికే ఆయన వైసీపీకి దగ్గరయ్యారు. గత ఎన్నికలలో పవన్ భీమవరం తో పాటు గాజువాకలో పోటీ చేసి రెండు చోట్ల ఓడిపోయారు. గాజువాకలో అయితే మూడో స్థానంతో సరిపెట్టుకున్నారు. ఇక పవన్ సోదరుడు నాగబాబు నర్సాపురం ఎంపీగా పోటీ చేసి ఆయన కూడా ఓడిపోయారు. కట్ చేస్తే ఈ ఎన్నికలలో తెలుగుదేశం బిజెపితో పొత్తు పెట్టుకున్నాక కూడా పవన్ పోటీ చేసే స్థానంపై పెద్ద సస్పెన్స్ నడుస్తోంది.
పవన్ ఎక్కడ పోటీ చేస్తానని చెబుతున్న జగన్ అక్కడ కాన్సన్ట్రేషన్ చేస్తున్న పరిస్థితి కనిపిస్తోంది. జగన్ పవన్ ను వెంటాడుతుంటే పవన్ రోజుకో సీటు మార్చుకోవాల్సిన పరిస్థితి. భీమవరం, గాజువాక అయిపోయాయి. కృష్ణా జిల్లాలో అవనిగడ్డ అయిపోయింది. మధ్యలో సొంత నియోజకవర్గ నరసాపురం పేరు కూడా వినిపించింది. చివరకు ప్రజారాజ్యం గెలిచిన తాడేపల్లిగూడెం సీటు కూడా పవన్ పోటీ చేసే జాబితాలో చేరింది. ఆ తర్వాత కాకినాడ పార్లమెంటు పరిధిలోని పిఠాపురం పేరు తెరమీదకు వచ్చింది.
అయితే ఇప్పుడు పవన్ అసెంబ్లీతో పాటు పార్లమెంటుకు కూడా పోటీ చేస్తారని పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతోంది. కాకినాడ పార్లమెంటు నుంచి ప్రచారం చేస్తారని జనసేన వర్గాలు చర్చించుకుంటున్నాయి. అటు పార్లమెంటుతో పాటు ఇటు అసెంబ్లీ సీటుకు కూడా పోటీ చేస్తారట. అదే జరిగితే రెండిటికీ చెడ్డ రేవుడిగా మారతారా అన్న కొత్త చర్చ కూడా తెరమీదకు వచ్చింది. ఏది ఏమైనా పవన్ నమ్మకంగా గెలిచే నియోజకవర్గం కోసం ఎన్ని ఆపసోపాలు పడుతుండటం జనసేన వర్గాల్లోనే కామెడీగా మారింది.