రాజకీయాల్లో తల తన్నేవాడు ఒకడుంటే.. తాడితన్నేవాడు మరొకడు ఉంటాడు. వ్యూహానికి ప్రతివ్యూహం సిద్ధంగానే ఉంటుంది. ఇప్పుడు కాకినాడ జిల్లా పిఠాపురం నియోజకవర్గంలోనూ ఇదే ప్రతి వ్యూహాన్ని ప్లే చేస్తున్నారు జనసేన అధినేత పవన్ కల్యాణ్. పిఠాపురం నుంచి ఆయన పోటీకి రెడీ అయ్యారు. ఈ క్రమంలో గెలుపు గుర్రం ఎక్కేందుకు సహజంగా అందరూ ఆలోచంచి నట్టుగానే ఆయన కూడా ఆలచిం చారు. కానీ, దీనికి కొంత భిన్నత్వాన్ని జోడించారు.
వైసీపీ నుంచి పిఠాపురంలో పోటీ చేస్తున్న ఎంపీ వంగా గీతను పరోక్షంగా టార్గెట్ చేసేందుకు పవన్ రెడీ అయ్యారు. పవన్ టార్గెట్కు ముందు.. ప్రస్తుతం వంగా గీత చేసిన టార్గెట్ తెలుసుకుంటే.. ఆమె పవన్కు యాంటీగా ప్రచారం చేస్తున్నారు. ఆయన లోకల్ కాదని.. నాన్లోకల్ అని.. ఇక్కడ గెలిచినా ఉండరని ఆమె ప్రచారంలో ఎక్కువగా చెబుతున్నారు. ముఖ్యంగా సోషల్ మీడియాలో గీత ఈ దిశగానే ప్రచారం చేస్తున్నారు. ఇది నిజమే. దీంతో పవన్ యాంటీ టార్గెట్ను తెరమీదికి తెచ్చారు.
వంగా గీత చేస్తున్న నాన్లోకల్ కామెంట్లను ఆయన పక్కన పెట్టి.. గీతపై ప్రధానమైన ముద్ర పడేలా.. కొ న్ని వ్యాఖ్యలు చేశారు. ఆమెకు రాజకీయంగా నిలకడలేదని.. ఒక పార్టీలో గెలిచి.. రేపు మరో పార్టీ మారిపో యే నాయకురాలని పవన్ ప్రచారంలోకి తెచ్చేందుకు సిద్ధమయ్యారు. ఇదే విషయాన్ని తాజాగా జనసేన పిఠాపురం నాయకులతో నిర్వహించిన సమావేశంలోనూ పవన్ ప్రధానంగా చెప్పారు. ఈ విషయాన్ని విస్తృతంగా ప్రచారం చేయాలని అన్నారు.
అంటే.. వంగా గీత తనపై చేస్తున్న నాన్ లోకల్ ప్రచారానికి దీటుగా.. ఆమెకు నిలకడలేదని.. ఇప్పుడు మీరు నమ్మి.. ఆమెను వైసీపీ తరఫున గెలిపించినా.. రేపు ఆమె మా పార్టీలోకి వచ్చినా ఆశ్చర్యంలేదనే విధంగా పవన్ చెబుతున్నారు. ఇది కూడా వాస్తవమే. గతంలో ప్రజారాజ్యంలో పనిచేసిన గీత .. తర్వాత వైసీపీకి మారారు. రేపు వైసీపీ అధికారంలోకి రాకపోతే. మరోసారి పార్టీ మారినా ఆశ్చర్యంలేదు. ఇదే వీక్నెస్ను పవన్ తనకు అనుకూలంగా మార్చుకున్నారు. ఇలాంటి పార్టీలు మారే వారే.. అత్యంత ప్రమాదమనేది ఆయన వ్యూహం. దీనినే పిఠాపురంలో పెద్ద ఎత్తున ప్రచారం చేసేందుకు పవన్ సంసిద్ధంగా ఉండడం గమనార్హం.