Trinayani March 21 2024 Episode 1194: విక్రాంత్ తను అన్నదని నువ్వేమీ దెప్పిపొడవ అవసరం లేదు కానీ గాయత్రి పాప జాతకం ఎలా ఉందో తెలుసా అమ్మవారి పేరు పెట్టుకోవడం వల్ల జాతకం బాగుంది ఇప్పుడు ఈ చిన్నారి నా చెల్లెలి గాయత్రి పేరుతో ఉంటుంది అని లలితాదేవి కిరీటం పెడుతుంది. అది చూసి అందరూ చప్పట్లు కొడతారు. బియ్యం మీద పేరు రాయమని తిలోత్తమ సుమనకి చెబుతుంది. ముందు ఆస్తి పేపర్ల మీద సంతకం పెట్టమనండి అని సుమన అంటుంది. సుమన పెద్దమ్మకి గాయమైంది కదా ఎలా పెడుతుంది అని విశాల్ అంటాడు. అయితే వదిలేయండి అని సుమన అంటుంది. నేను ఏదైనా మాట ఇచ్చాను అంటే తప్పను అని లలితాదేవి అంటుంది. రేపు మనసు మార్చుకోవచ్చేమో అని సుమన అంటుంది. సుమన పెద్దమ్మ వ్యక్తిత్వం నీకు తెలియదు అందుకే ఇలా మాట్లాడుతున్నావ్ అని విశాల్ అంటాడు.
వయసు పెరిగినవారు ఎప్పుడు ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో చెబుతుంది అని తిలోత్తమ అంటుంది. వందల ఆస్తిని దానం చేస్తున్నప్పుడు రాని నొప్పి చెయ్యికి అయిన గాయం వల్ల వస్తుందా అని సుమన అంటుంది. సుమన పెద్దమ్మ గారు చెప్పినట్టు ఈ గాయత్రి పాపకి ఆస్తి రాసిచ్చిన నేను కన్న కూతురు తిరిగి వచ్చిన తనకు ఆస్తి దక్కుతుంది అంటే రాసిచ్చిన రాసివ్వకపోయినా ఒకటే అని నైని అంటుంది. రాసిస్తా అన్నాక రాసివ్వాలి కదా అని తిలోత్తమ అంటుంది. విశాల్ పెన్ను ఇవ్వు అని లలితా దేవి పెన్ను తీసుకొని ఆ పేపర్ల మీద సంతకం పెడుతూ ఉండగా తన చెయ్యికి రక్తం వస్తుంది. పెద్దమ్మ వదిలేయండి రక్తం వస్తుంది అని విశాల్ అంటాడు. ఆ నొప్పిని భరిస్తూ లలితాదేవి పేపర్ల మీద సంతకం పెడుతూ ఉంటుంది. లలితా దేవి మీద ఆ గుడ్డ ఎప్పుడు పడుతుంది అని వల్లభ తిలోత్తమ చూస్తూ ఉంటారు. అమ్మగారు గాయం ఇంకా పచ్చిగానే ఉంది మీరు సంతకం పెట్టకండి అని నైని అంటుంది. మరి సంతకం ఎలా అని సుమన అంటుంది.
ఈ డాక్యుమెంట్ కి వ్యాల్యూ కావాలి అంతే కదా అని లలితా దేవి కట్టు విప్పేసి పిడికిలి బిగించి, వందల ఆస్తి నాకు లెక్క కాదు నా చెల్లెలు ఎలా ఉందో నేను చూడాలి గాయత్రిని దత్తత తీసుకున్నారు తను నైనీ విశాల్ కూతురుగానే పెరుగుతుంది కాబట్టి ఈ ఆస్తి గాయత్రి దేవి పేరు మీదనే రాయించి సంతకం పెట్టాలనుకున్నాను చేతికి గాయమై నొప్పి లేస్తున్న నేను వెనకడుగు వేయను మాట తప్పను అని లలితా దేవి ఆ పేపర్ల మీద తన రక్తంతో వేలిముద్రలు వేస్తుంది. అప్పుడు ఒక పెద్ద గాలి వచ్చి తిలోత్తమ పైన ఉన్న గుడ్డ వచ్చి లలితాదేవి చేతి మీద పడుతుంది. అది చూసి అందరూ షాక్ అవుతారు. అదే గుడ్డతో లలితా దేవికి కట్టు కడుతుంది. ఈ క్లాత్ ఎక్కడి నుంచి వచ్చింది అని హాసిని అంటుంది. తిలోత్తమ వల్లభ ఆశ్చర్యపోయి చూస్తారు. ఆస్తి రాసిస్తున్నట్టుగా వేలి ముద్రలు వేశాను సరిపోతుందా తిలోత్తమ సంతకాలు పెట్టాల్సిన అవసరం లేదు వేలిముద్రలు కూడా చెల్లుతాయి సుమన అని లలితా దేవి అంటుంది. రాజమాత పుట్టుక రక్తంలోనే ఉంటుంది అని ఎద్దులయ్య అంటాడు.
బియ్యం మీద పేరు ఎవరు రాస్తారు అని పావన మూర్తి అంటాడు. బియ్యంలో వేలుతో రాయటం కష్టం కాదేమో లలిత అక్కకి అని తిలోత్తమ అంటుంది. రక్త తర్పణ చూసారు ఇక చాలు అమ్మ అని విశాల్ అంటాడు. మరి ఎవరు రాస్తారు అని వల్లభ అంటాడు. వేలుతో బియ్యం మీద గాయత్రీ దేవి అని రాయగలను ప్రాబ్లం లేదు అని లలితాదేవి అంటుంది. నైనీ బియ్యం పట్టుకుంటుంది. తిలోత్తమ వల్లభ అందులో పాము ఉందని లలితా దేవి చచ్చిపోతుందని అనుకుంటారు. లలితా దేవి రాయబోతు ఉండగా ఒక్క నిమిషం అమ్మగారు అని నైని అంటుంది. నైని ఏమైంది అని విశాల్ అంటాడు. రక్తం అంటిన చేతితో పేరు రాయడం మంచిది కాదనిపిస్తుంది అని నైని అంటుంది. ఎడమ చేత్తో రాయక్క అని తిలోత్తమ అంటుంది. ఎడమచేత్తో రాయకూడదు అని లలితాదేవి అంటుంది.
అయితే విశాల్ తో రాయించండి అని వల్లభ అంటాడు. బాబు గారు నేను రాయొచ్చా అని నైని అంటుంది.నా చెల్లికి కోడలు అయిన నువ్వు ఇప్పుడు తల్లివి అయ్యావు నువ్వు రాయి అని లలితా దేవి అంటుంది. నైని వేలు పెట్టి రాయబోతూ ఉండగా నాగయ్య లేచి బుసలు కొడతాడు. హాసిని ఆ తాంబలాన్ని కింద పడేస్తుంది. నాగయ్య ఎలా వచ్చాడు అని హాసిని అంటుంది.
గాయత్రీ దేవి అని పేరు పెట్టడం నాగయ్యకి ఇష్టం లేదనుకుంటా అని సుమన అంటుంది. నాగయ్య అలా చేయడు అని అంటుంది నైనీ. నాగయ్య ఎందుకిలా చేసావ్ పెద్దమ్మకి చెయ్యి తెగిన అమ్మ నామకరణం జరగాలని రక్తంతో వేలిముద్రలు వేశారు తెలుసా అని విశాల్ అంటాడు. బియ్యం పోసేటప్పుడు పాము కనిపించలేదా మీకు అని లలితాదేవి అంటుంది. బియ్యం పోసింది ఎవరు మాత అని ఎద్దులయ్య అంటాడు.. దీనితో ఈరోజు ఎపిసోడ్ ముగుస్తుంది
Krishna Mukunda Murari: 45 ఏళ్ల వయసులో కూడా చెక్కుచెదరని అందంతో మైమరిపిస్తున్న కృష్ణ ముకుందా మురారి నటి.. ఫొటోస్ వైరల్..!