జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ రాజకీయంగా ఒక పార్టీ నాయకుడిగా కొనసాగుతున్నాడు.మిగిలిన వారితో పోల్చుకుంటే పవన్ రాజకీయాలు కొత్తగా ఉంటాయని ప్రజలు అభిప్రాయపడుతుంటారు. తన రాజకీయ ప్రస్థానాన్ని టిడిపితో కలిసి ప్రారంభించిన పవన్ తర్వాత కొద్దికొద్దిగా రాజకీయం ఓనమాలు దిద్దడం నేర్చుకున్నాడు. అది చంద్రబాబు నేర్పించాడా…. లేదా అనుభవం నేర్పిందా అన్న విషయం పక్కన పెడితే అతను మాత్రం క్రమంగా ఒక బలమైన శక్తిగా ఎదిగేందుకు కీలకమైన ముందడుగు వేశాడు అనే చెప్పాలి.
రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ను మరియు అతని పార్టీని కరోనా నియంత్రణ చర్యల్లో వారు చూపిస్తున్న పటిమను పవన్ కళ్యాణ్ ప్రశంసించడం విశేషం. ఇక టీడీపి సంగతి సరేసరి. జగన్ ఏం చేసినా వారిని అసలు నచ్చదు. లేనిపోని విమర్శలు చేస్తూ బురద జల్లుడే పనిగా పెట్టుకుంటారు తమ్ముళ్ళు, ఇంతటి స్థితిలో కూడా జనసేన తరఫున పవన్ కళ్యాణ్ జగన్ని మెచ్చుకుంటూ ప్రశంసల జల్లు కురిపించడం అంటే మాటలు కాదు.
ఎందుకంటే పవన్ ఎపుడూ జగన్ మంచిని మెచ్చలేదు. తప్పులు జరిగితే మాత్రం గట్టిగానే తగులుకునేవారు. అటువంటి పవన్ ఇన్నాళ్ళకు ఉన్నది ఉన్నట్లుగా మాట్లాడి తాను అసలైన ప్రజా నాయకుడిని అనిపించుకున్నారు. ఎప్పుడూ జగన్ చేసే పనులను విమర్శించే పవన్ ఒక్కసారిగా కరోనా నేపథ్యంలో జగన్ కృషిని మరియు 1088 మెడికల్ ఎమర్జెన్సీ వాహనాలను జగన్ ప్రారంభించి ఈ కరోనా కష్టకాలంలో గ్రామాలకు పంపడం, కరోనా టెస్టుల అధికల సంఖ్యలో చేయడం అంటే సామాన్య విషయం కాదని పవన్ అన్నారు.
ఇక దీని వెనుక చాలా పెద్ద స్టోరీ ఉందని టిడిపి వర్గాలతో పాటు వైసిపి వర్గాలు కూడా భావిస్తున్నాయి. పవన్ గురించి బాగా తెలిసిన వారు ఇది ఒక కొత్త స్ట్రాటజీ అని చెబుతున్నారు. జగన్ కు ఉన్న భారీ ఫాలోయింగ్ నడుమ ప్రతిసారి అతని విమర్శించడం సరికాదని పవన్ తెలుసుకున్నాడట. అంతే కాకుండా నిజాయితీగా రాజకీయాలు చేస్తే ఎప్పటికైనా ప్రజలు ఆదరిస్తారు అనే ఉద్దేశంతో మనసులో ఉన్నది ఉన్నట్లు జగన్ గురించి చెప్పేశారు.
ఇకపోతే కరోనా నియంత్రణలో ఆంధ్రప్రదేశ్ దేశంలో చాలా రాష్ట్రాలు కన్నా ఎంతో ముందు ఉంది అన్నది వాస్తవం. అటువంటి సమయంలో ఊరికే ఉండకుండా జగన్ ను పొగుడుతూ రాష్ట్రంలోని న్యూట్రల్స్ ను తన వైపు తిప్పుకునే పనే ఇది అంటున్నారు. ఇప్పుడు జగన్ ను పొగిడిన పవన్ కి రేపు ఏదో ఒక విషయంలో ప్రభుత్వాన్ని, అధికార పార్తీని విపరీతంగా విమర్శించే అవకాశం పవన్ కు రాకపోదు. అప్పుడు ఎప్పుడూ విమర్శలు చేసే లీడర్ గా కాకుండా నిజాయితీగా రాజకీయాలు చేసే వ్యక్తిగా రాష్ట్ర ప్రజలకు గుర్తుండిపోవాలన్నదే అతని ఆకాంక్ష.