భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ పర్సనల్ వెబ్ సైట్ కు చెందిన ట్విట్టర్ అకౌంట్ హ్యాక్ అయింది. కోవిడ్–19 రిలీఫ్ ఫండ్ కోసం డొనేషన్ కింద బిట్ కాయిన్ ను హ్యాకర్లు డిమాండ్ చేశారు.
వెంటనే హ్యాకర్లు సదరు బోగస్ ట్వీట్లను డిలీట్ చేయడం జరిగింది. ముందుగా ప్రధాని నరేంద్ర మోడీ పర్సనల్ వెబ్సైట్ కు చెందిన ట్విట్టర్ అకౌంట్ ను క్రిప్టో కరెన్సీతో ముడిపెడుతూ ట్వీట్ వచ్చింది. దానిలో కోవిడ్–19 కోసం ఏర్పాటుచేసిన పీఎం మోదీ రిలీఫ్ ఫండ్ కు డొనేట్ చేయాలని కూడా మెసేజ్ లు కూడా వచ్చాయి.
మొత్తానికి ప్రభుత్వం తరఫున ఎథికల్ హ్యాకర్లు ఈ విషయంపై పూర్తి విచారణ జరుపుతున్నారు. త్వరలోనే ఈ పని చేషింది ఎవరో ఎవరో బట్టబయలు చేస్తామని వారు నమ్మకంగా ఉన్నారు. మోదీ ట్విట్టర్ అకౌంట్ జాన్ విక్ పేరుతో హ్యాక్ అయ్యింది. ఈ హ్యాకర్ గ్రూప్ పేరు జాన్ విక్ అని అనుమానిస్తున్నారు.
అయితే దేశ ప్రధానమంత్రి అకౌంట్ కే ఈ రోజుల్లో రక్షణణ లేకపోతే సామాన్య ప్రజల పరిస్థితి ఏమిటన్నది సందేహంగా మారింది.