Priyamani : ప్రియమణి నేషనల్ అవార్డ్ విన్నర్ అనే విషయం అందరికీ తెలిసిందే. తను నటించిన పరుత్తి వీరన్ సినిమాలోని నటనకు గానూ ఈ అవార్డ్ దక్కించుకుంది. అది కూడా తన మొదటి సినిమాతోనే. ఈ సినిమా తర్వాత అటు తమిళంలో ఇటు తెలుగులో ప్రియమణి పేరు మార్మోగిపోయింది. అందరి చూపు ఈమె పై పడింది. ఈ క్రమంలో తెలుగులో మొదటి సినిమా కె ఎస్ రామారావు తనయుడు వల్లభ సరసన నటించింది. ఎవరే అతగాడు టైటిల్ తో తెరకెక్కిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద నిలబడలేకపోయింది.
దాంతో ఇక తెలుగులో మళ్ళీ కనిపించదని అందరు భావించారు. అందుకు కారణం మన ఇండస్ట్రీలో ఎక్కువగా సెంటిమెంట్స్ ఉండటమే. హీరోయిన్ గా పరిచయమవుతూ భారీ హిట్ అందుకోవాలి. అప్పుడు అందరూ నెత్తి మీద పెట్టుకుంటారు. వరుసగా అవకాశాలు కట్టబెడతారు. అదే మొదటి సినిమా గనక ఫట్ అయితే మాత్రం ఐరెన్ లెగ్ అని ముద్ర వేసేస్తారు. మరో అవకాశం ఇవ్వడానికి ఎవరూ ఆసక్తి చూపించరు. కానీ ప్రియమణికి అదృష్టం కొద్ది జగపతి బాబుతో నటించే అవకాశం అందుకుంది.
Priyamani : వెంకటేష్ నటించిన నారప్పతో రీ ఎంట్రీ ఇస్తోంది.
పెళ్ళైన కొత్తలో అనే సినిమా చేసింది. ఈ సినిమా సూపర్ హిట్ అవడంతో ఇక వెనక్కి తిరిగి చూసుకోవాల్సిన అవసరం రాలేదు. సీనియర్ హీరోలతో పాటు నితిన్, తరుణ్ లాంటి యంగ్ హీరోలతోనూ నటించి సూపర్ హిట్స్ అందుకుంది. కానీ విక్టరీ వెంకటేష్ సరసన నటించే అవకాశం మాత్రం మిస్ అయింది. ఆ తర్వాత పెళ్ళి చేసుకొని కొన్నాళ్ళు ఇండస్ట్రీకి దూరమయింది. మళ్ళీ వెంకటేష్ నటించిన నారప్పతో రీ ఎంట్రీ ఇస్తోంది. రీ ఎంట్రీ వెంకీ సరసన అనగానే ఏమాత్రం ఆలోచించికుండా ఓకే చెప్పిందట ప్రియమణి. ఈసారి మాత్రం ఎట్టి పరిస్థితుల్లో ఈ ఛాన్స్ మిస్ చేసుకోకూడనేదే కారణం అని తెలిపింది.
Mogalirekulu: నీకెంతా బలుపు రా?.. మొగలిరేకులు ఫేమ్ ఆర్కే నాయుడు పై సీనియర్ నటి ఫైర్..!