దేశవ్యాప్తంగా మోడీ ప్రభుత్వం తీసుకువచ్చిన వ్యవసాయ చట్టాలను వ్యతిరేకిస్తూ రైతులందరూ చాలా వారాల నుండి తీవ్ర స్థాయిలో నిరసన వ్యక్తం చేసిన విషయం తెలిసిందే. అయితే కేంద్రం మాత్రం అదే మొండితనంతో ఉంది ఈ క్రమంలో ఒక పంజాబ్ రైతు రాసిన లేఖ బాగా హైలెట్ అవుతోంది….
ఏకంగా మోదీ తల్లికే లేఖ…!
ప్రపంచంలో తల్లి మాటను దాదాపు ఏ కొడుకు కాదనడు అని అంటారు. అందులో మన ప్రధానమంత్రి మోడీ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. తల్లి అయనకు అంటే మహా ఇష్టం. అయితే ఇప్పుడు రైతుల నిరసనలు, ఆందోళనలను మోడీ ప్రభుత్వం పట్టించుకోవడం లేదు. ఇలాంటి వేళ మోది తల్లికి ఒక రైతు రాసిన లేఖ ఇప్పుడు దేశవ్యాప్తంగా హాట్ టాపిక్ అయిపోయింది. పంజాబ్ కి చెందిన ఒక రైతు వివాదాస్పద చట్టాలను రద్దు చేయాలని మోదీకి నచ్చచెప్పాలని ఆయన తల్లి హీరాబెన్ కు లేఖ రాశారు.
బాధలు వెళ్ళగక్కాడు..!
బరువెక్కిన మనసుతో తాను ఈ లేఖ రాస్తున్నాను అని పేర్కొన్న సదరు రైతు ఇలా రాశాదు – “ఈ దేశానికి అన్నం పెట్టే అన్నదాత లు నల్ల చట్టాలను ఎదిరించడానికి గడ్డకట్టే చలిలో గత్యంతరం లేక రోడ్లపై నిద్రపోతున్నారు. వీరిలో మహిళలు, చిన్న పిల్లలు, 90 నుంచి 95 ఏళ్ల మధ్య వయసున్న వయోవృద్ధులు కూడా ఉన్నారు. బలిదానాలకు కూడా సిద్ధమవుతున్నారు. ఇవన్నీ భరిస్తూ మేము తల్లడిల్లిపోతున్నామని” పంజాబ్ కు చెందిన హర్ ప్రీత్ సింగ్ అనే రైతు ఆ లేఖలో పేర్కొన్నాడు. అంతేకాకుండా వణికించే చలి లో ఉన్న ప్రదేశం నుండి రోడ్డుపైన ఈ లేఖ రాసినట్లు చెప్పాడు.
వాళ్ళ రియాక్షన్ ఏంటి…?
ఇలా చెప్పిన హరి ప్రీత్ సింగ్ అంబానీ, అదాని, ఇతర కార్పొరేట్ సంస్థల కోసం తీసుకొచ్చిన మూడు నల్ల చట్టాల కారణంగా తమ ఢిల్లీ సరిహద్దుల్లో ఇలా శాంతియుతంగా నిరసన చేస్తున్నామని…. మీ కుమారుడు నరేంద్ర మోడీకి…. ఏ దేశానికి చెందిన ప్రధానిగా ఆమోదించిన చట్టాలని ఆయన రద్దు చేయగలడు అని… మీరు ఒప్పించగలరు అని ఆశాభావం వ్యక్తం చేస్తూ ఈ లేఖను రాసినట్లు తెలిపారు. ఇప్పుడు ఈ లేఖ పై మోడీ, అతని తల్లి ఎలా రియాక్ట్ అవుతారో చూడాలి..!