Radhe shyam: పాన్ ఇండియన్ స్టార్ ప్రభాస్ హీరోగా నటించిన రాధే శ్యామ్ సినిమా రిలీజ్కు సరిగ్గా నెలరోజుల సమయం ఉంది. ఈ నెలరోజులు ప్రమోషన్స్ ఎలా చేయాలనే ప్లాన్ చేస్తున్నారు దర్శక నిర్మాతలు. ఈ క్రమంలో పలు జాతీయ మీడియాలకు ఇంటర్వ్యూస్ ఇస్తున్నారు. ఈ క్రమంలోనే తాజాగా చిత్ర దర్శకుడు రాధకృష్ణ ఓ మీడియాకు ఇంటర్వ్యూ ఇచ్చాడు. అయితే ఈ ఇంటర్వ్యూలో ఆయన పొరపాటున రాధే శ్యామ్ కథేంటో రివీల్ చేసేశాడు. ఇప్పుడు ఇదే సోషల్ మీడియాలో హాట్ టాపిక్గా మారింది.
సినిమా ప్రమోషన్స్లో భారీగా అంచనాలు పెంచేసేందుకు ట్రై చేస్తూనే కథ గురించి కీలకమైన విషయాలను వెల్లడించడంతో ప్రభాస్ ఫ్యాన్స్ ఇప్పుడు దర్శకుడు రాధాకృష్ణ కుమార్ మీద ఫైర్ అవుతున్నారట. రాధే శ్యామ్ సినిమా కథ పీరియాడికల్ లవ్ స్టోరి అని మాత్రమే తెలుసు. ఆ మధ్య టీజర్ రిలీజ్ చేసినప్పుడు ప్రభాస్ ఇందులో పామిస్ట్గా నటిస్తున్నట్టు రివీల్ చేశారు. హస్త సాముద్రికుడి పాత్రలో ప్రభాస్ నటిస్తున్నాడగానే అందరిలో విపరీతమైన ఆసక్తి నెలకొంది. ఇలాంటి కథలో ప్రభాస్ ఇంతకముందు ఎప్పుడూ నటించలేదు.
Radhe shyam: ‘రాధేశ్యామ్’ సినిమా కథ అని ఓపెన్ చేశాడు.
పైగా ఈ పాయింట్తో అద్భుతమైన ప్రేమకథను సిల్వర్ స్క్రీన్ మీద చూడబోతున్నారనే క్యూరియాసిటీని పెంచారు. అయితే తాజాగా దర్శకుడు రాధాకృష్ణ లైఫ్ అండ్ డెత్ కీ మధ్య సెలబ్రేషన్ జరిగితే ఎలా వుంటుంది అనేదే ‘రాధేశ్యామ్’ సినిమా. భావోద్వేగాల పరంగా ఈ మూవీ చాలా పెద్దది. జాతకాల్ని నమ్మేవాళ్లున్నారు..అస్సలు నమ్మని వాళ్లు ఉన్నారు. దీనిలో నిజమెంత? .. అబద్ధం ఎంత? అనేది ఎప్పుడూ హాట్ టాపిక్. దీనికి లవ్ స్టోరీని జోడిస్తే ఎలా వుంటుంది..అనే ఆలోచనలో నుంచి పుట్టిందే ‘రాధేశ్యామ్’ సినిమా కథ అని ఓపెన్ చేశాడు. దాంతో ఇప్పుడు కథ లీకైందంటూ..అభిమానులు కొంత ఆందోళన చెందుతున్నారట. చూడాలి మరి ఈ సినిమాను ఎలా ప్రజెంట్ చేయబోతున్నాడో.
Mogalirekulu: నీకెంతా బలుపు రా?.. మొగలిరేకులు ఫేమ్ ఆర్కే నాయుడు పై సీనియర్ నటి ఫైర్..!