నరసాపురం ఎంపీ రఘురామకృష్ణంరాజు ఏం చేసినా ప్రత్యేకమే. సమయం చూసుకుని, సందర్భాన్ని తనకు అనుకూలంగా మార్చుకుని, తన మార్కు రాజకీయం చేయడంలో ఆయన దిట్ట. ఎందుకో.., ఏమిటో మరో ఉదాహరణ ఇది. రాష్ట్రంలో అధికారంలో ఉన్న బలమైన పార్టీతో, సీఎంతో ఆయన పెట్టుకుంటున్నారు…?? తాను పార్టీకి వ్యతిరేకం కాదు అంటూనే… ఎమ్మెల్యేలను గిచ్చుతున్నారు, పార్టీ నాయకులను కెలుకుతున్నారు. ఒకరకంగా పార్టీ నాయకులతో ఆడుకుంటున్నారు. అందుకే వైసీపీ కూడా ఆయన విషయంలో సీరియస్ గా ఉంది. ఆయనను పార్టీ నుండి, పార్లమెంట్ నుండి కూడా సాగనంపాలని డిసైడ్ అయింది. అందుకు రేపు ముహూర్తం పెట్టింది. మరి రాజుగారు ఊరకనే ఉండరు కదా. ఉంటే ఆయన రాజుగారే కాదు కదా..!
నిజానికి రాజుగారు మొదటి నుండి బీజేపీ మనిషి. ఆయన రాజకీయం మొదలవ్వడమే బిజెపి నుండి అయింది. ఇప్పుడు ఆయనకు బీజేపీ నుండి పెద్ద పని పడింది. అందుకే తరచు ఆ పార్టీ నేతలను కలుస్తూ వస్తున్నారు. ఇప్పుడు ఏకంగా మోడీకి లేఖ రాశారు. ఒక ఎంపీ, ప్రధానికి లేఖ రసారంటే… నిధుల కోసమో.., ప్రాజెక్టు కోసమో.., పథకం కోసమో.., అనుకుంటారేమో… కాదు రాజుగారి బిస్కెట్ లేఖ అది. సాక్షాత్తూ ప్రధాని మోదికి తన లేఖ ద్వారా “బిస్కెట్” వేశారు. మ్యాటర్ ఏమి లేదు. “అయ్యా…! దయార్ద్ర హృదయ…!! అయ్యా మోడీ గారూ…!! ప్రధానమంత్రి గరీబ్ కళ్యాణ్ యోజన పథకంను నవంబర్ నెల వరకు పొడిగించినందుకు కృతజ్ఞతలు. మీ లాంటి నాయకుడు ఈ సమయంలో దేశానికి అవసరం. మీరు దయార్ద్ర హృదయుడు” అంటూ రాశారు. పనిలో పనిగా తన పేరు మోడీకి మరోసారి మెదిలేల…, తనను ఓ కంట చేసుకునేలా… తన లేఖని ఈ బిస్కట్ రూపంలో వాడుకున్నారని ఆయనపై వ్యంగ్యంగా చక్కర్లు కొడుతున్నాయి.