మరో నాలుగు నెలల్లో తెలంగాణలో ఎన్నికలు జరగనుండటంతో ప్రధాన రాజకీయ పక్షాలు అన్నీ అభ్యర్ధుల ఎంపికపై దృష్టి పెట్టాయి. వివిధ నియోజకవర్గాల్లో గెలుపు గుర్రాలను ఎంపిక చేసేందుకు కసరత్తు చేస్తున్నాయి. ఇప్పటికే టీఆర్ఎస్ అధినేత సీఎం కేసిఆర్ 115 మంది అభ్యర్ధులను ప్రకటించారు. ఇతర రాజకీయ పక్షాలు అభ్యర్ధుల ఎంపికపై దృష్టి సారించాయి. ఈ తరుణంలో ఇప్పటి వరకూ రాజకీయాల్లో లేని సెలబ్రెటీలు ఎన్నికల్లో పోటీకి వస్తున్నట్లుగా సోషల్ మీడియాలో ప్రచారాలు జరుగుతున్నాయి. ఇదే క్రమంలో ..
టాలీవుడ్ ప్లేబ్యాక్ సింగర్ రాహుల్ సిప్లిగంజ్ రాజకీయాల్లోకి వస్తున్నారనీ, గోషామహల్ నుండి ఎమ్మెల్యేగా పోటీ చేయనున్నారంటూ మీడియాలో కథనాలు వచ్చాయి. అయితే ఈ వార్తల్లో ఎలాంటి నిజం లేదని రాహుల్ సిప్లిగంజ్ స్పష్టం చేశారు. తాను ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్నట్లు జరుగుతున్న ప్రచారాన్ని ఆయన ఖండించారు. ఎన్నికల్లో పోటీ చేయడానికి తనను ఏ రాజకీయ పార్టీ సంప్రదించలేదని తెలిపారు. తాను రాజకీయాల్లోకి రావడం లేదని కరాఖండిగా చెప్పారు.
తనకు అన్ని పార్టీలు అందరు నాయకులంటే గౌరవం ఉందని చెప్పారు. తాను ఒక కళాకారుడిగా ఎంటర్ టైన్ చేయడమే తన బాధ్యత అని తెలిపారు. గత కొద్ది రోజులుగా తనపై జరుగుతున్న ప్రచారం అంతా ఫేక్ న్యూస్ అని చెప్పేశారు. తన దృష్టి అంతా మ్యూజిక్ కెరీర్ పైనే ఉంటుందని, ఈ వృత్తిలోనే కొనసాగుతానని చెప్పారు. ఈ పరిశ్రమకు తాను చేయాల్సింది చాలా ఉందని అన్నారు. దయచేసి ఇలాంటి పుకార్లు ఆపాలని విజ్ఞప్తి చేశారు. రాహుల్ సిప్లిగంజ్ ప్రకటనతో క్లారిటీ ఇచ్చినట్లు అయ్యింది.
మరో సారి తన దొడ్డ మనసు చాటుకున్న ఏపీ సీఎం వైఎస్ జగన్ .. క్యాన్సర్ బాధితురాలికి రూ.3 లక్షల సాయం