Rajamouli: ప్రస్తుతం దర్శక ధీరుడు ఎస్ ఎస్ రాజమౌళి ఆర్ఆర్ఆర్ సినిమా ప్రమోషన్స్లో చాలా బిజీగా ఉన్నారు. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, యంగ్ టైగర్ హీరోలుగా రూపొందిన ఈ పాన్ ఇండియన్ సినిమా వచ్చే నెల 7వ తేదీన భారీ స్థాయిలో ప్రపంచ వ్యాప్తంగా పది భాషలలో రిలీజ్ కానుంది. ఈ నేపథ్యంలో రాజమౌళి స్ట్రాటజీ స్టైల్లో భారీగా ప్రమోషన్స్ నిర్వహిస్తున్నారు. ఈ ప్రమోషన్స్లో ఇద్దరు హీరోలు పాల్గొంటున్నారు. ఈ నేపథ్యంలో ఇప్పటికే ఆర్ఆర్ఆర్ సినిమా మీద ఎంతగా భారీ అంచనాలున్నాయో.. ఆ తర్వాత రాజమౌళి చేయబోయో సినిమాల విషయంలో అంతే ఆసక్తి నెలకొంది.
ఈ ప్రమోషన్స్లో ఇప్పటికే రాజమౌళిని పలువురు నెక్స్ట్ ప్రాజెక్ట్స్ మీద మాట్లాడాల్సిందిగా అడిగారు. అయినా ఆయన ఘాటుగా స్పందిస్తూ వచ్చారు గానీ అంత ఈజీగా నెక్స్ట్ చేసే సినిమా గురించి చెప్పలేదు. అయినా పదే పదే అడగడంతో ఆయన చేయబోతున్న ఫ్యూ చర్ ప్రాజెక్ట్స్ గురించి క్లారిటీ ఇచ్చారు. ఆ ప్రాజెక్ట్స్లో బాహుబలి సీక్వెల్ ఉండటం విశేషం. ఆర్ఆర్ఆర్ రిలీజయ్యాక సూపర్ స్టార్ మహేశ్ బాబుతో నెక్స్ట్ సినిమా చేయనున్నారు రాజమౌళి. ఈ సినిమాను శ్రీదుర్గ ఆర్ట్స్ బ్యానర్పై డా.కె.ఎల్.నారాయణ భారీ బడ్జెట్తో నిర్మించనున్నారు.
Rajamouli: రాజమౌళి సర్ప్రైజ్ చేస్తూ బాహుబలి పార్ట్ 3 ఉంటుందని వెల్లడించారు.
అయితే రాజమౌళి సర్ప్రైజ్ చేస్తూ బాహుబలి పార్ట్ 3 ఉంటుందని, ఆ సినిమాలకు సీక్వెల్గా బాహుబలి 3 చేయడానికి ప్లాన్ చేస్తున్నట్టు స్వయంగా ఆయన వెల్లడించారు. ప్రస్తుతం ప్రభాస్ నాలుగు సినిమాలు పూర్తి చేయాలి. ఇక రాజమౌళి..మహేశ్ బాబుతో చేయనున్న పాన్ ఇండియన్ సినిమా పూర్తవ్వాలి. ఆ తర్వాత బాహుబలి 3 అనౌన్స్మెంట్ వచ్చే అవకాశాలున్నాయి. ఈ ప్రాజెక్ట్ అనౌన్స్మెంట్ రావాలంటే 2025 వచ్చేస్తుంది. అందులో ఎలాంటి సందేహం లేదు. కానీ బాహుబలి 3 పక్కా ఉంటుందని మాత్రం ఫిక్సైపోవచ్చు. ఈ సినిమాతో ప్రభాస్ పాన్ ఇండియన్ స్టార్గా మారిన సంగతి తెలిసిందే.