Prashant Kishor: మోడీ, షా ద్వయం సర్వశక్తులను ఒడ్డినా పశ్చిమ బెంగాల్ లో మమతా బెనర్జీ మూడవ సారి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన సంగతి తెలిసిందే. ఈ గెలుపు జోష్ తో ఇక కేంద్రంలోని బీజేపీకి ప్రత్యామ్యాయం తానేనని భావిస్తున్న దీదీ..దేశ వ్యాప్తంగా తృణమూల్ ను విస్తరించడానికి వ్యూహాత్మకంగా పావులు కదుపుతున్నారు. తాజాగా గోవా పై ఫోకస్ పెట్టారు. ఇటీవల గోవాలో పర్యటించారు. వచ్చే ఏడాది ప్రారంభం లో జరగనున్న గోవా అసెంబ్లీ ఎన్నికల కోసం టీఎంసీ ఇప్పటికే రాష్ట్రంలోని ప్రాంతీయ పార్టీ మహారాష్ట్రవాది గోమంతక్ పార్టీ ((ఎంజీపీ)తో పొత్తు పెట్టుకుంది. గోవాలో అసెంబ్లీ ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించారు. అంతకు ముందు ఎన్సీపీ నేత శరద్ పవార్ తో భేటీ అయ్యారు. ఆ సందర్భంలో మీడియాతో యూపిఏనా అది ఎక్కడ ఉంది అన్నట్లుగా వ్యాఖ్యానించారు. ఆమె అలా మాట్లాడారు అంటే ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ (పీకే) గతంలో చేసిన వ్యాఖ్యలే కారణమని అనుకున్నారు.
Prashant Kishor: రాహుల్ గాంధీ ప్రధాని అవుతారు
పశ్చిమ బెంగాల్ ఎన్నికల్లో టీఎంసీ అధికారంలోకి రావడానికి వ్యూహకర్తగా పని చేసిన ప్రశాంత్ కిషోర్ (పీకే) రాహుల్ గాంధీ ప్రధాని అయ్యే అవకాశాలు లేవంటూ వ్యాఖ్యలు చేశారు. దేశంలో బీజేపీ వ్యతిరేక ప్రాంతీయ పార్టీలను ఐక్యం చేసే పనిలో పీకే నిమగ్నమైయ్యారు. ఆయన తొలుత కేంద్రంలోని బీజేపి గద్దెదించేందుకు కాంగ్రెస్ పార్టీ సహకారం కూడా తీసుకోవాలని భావించారు. ఆ క్రమంలో సోనియా గాంధీ, రాహుల్ గాంధీలతోనూ భేటీ అయి చర్చించారు. శరద్ పవార్ తోనూ చర్చలు జరిపారు. ఆ తరువాత ఏమి జరిగిందో ఏమో కానీ కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా వ్యాఖ్యలు చేశారు పీకే. దీంతో కేంద్రంలో చక్రంలో చక్రం తిప్పేది తానేనన్నట్లు మమత బెనర్జీ జాతీయ రాజకీయాలపై దృష్టి పెట్టారు. ఈ తరుణంలో ప్రశాంత్ కిషోర్.. కాంగ్రెస్ పార్టీ విషయంలో యూటర్న్ తీసుకుని సంచలన వ్యాఖ్యలు చేశారు. రాహుల్ గాంధీ ప్రధాని అయ్యే అవకాశాలు ఉన్నాయని వ్యాఖ్యానించారు పీకే. రాహుల్ గాంధీ ప్రధాని అవుతారు. కాంగ్రెస్ లేకుండా విపక్షాల ఐక్యత సాధ్యం కాదని పీకే అన్నారు. జాతీయ స్థాయి రాజకీయాల్లో గాంధీ కుటుంబం అండ లేకపోయినా కాంగ్రెస్ మనుగడ సాధిస్తుందంటూ కీలక వ్యాఖ్యలు చేశారు. ఓ ఛానల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన ఈ కామెంట్స్ చేశారు. ఇప్పుడు పీకే వ్యాఖ్యలు రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశం అవుతున్నాయి.