కొన్ని వ్యవహారాలలో మనకి ఎటువంటి సంబంధం లేకపోయినా మనం సన్నితంగా ఉన్నవాళ్ళ వల్ల అనవసరంగా ఆరోపణలు ఎదుర్కోవాలి ఉంటుంది. సెలబ్రిటీస్ ని అయితే ఇది మరంత కష్టాల పాలు చేస్తుంది. తీగ లాగితే డొంక మొత్తం కదులుతుంది. కాని అందరూ బాధ్యులు కారు. ఇప్పుడు సౌత్ స్టార్ హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్ పరిస్థితి అలాగే ఉంది.
రకుల్ ప్రీత్ సింగ్ డ్రగ్స్ తీసుకున్నారని నేషనల్ మీడియాలో రక రకాల కథనాలు వస్తున్నాయి. రకుల్ డ్రగ్స్ తీసుకున్నట్టు నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో (ఎన్సీబీ) విచారణలో రియా చక్రవర్తి వెల్లడించినట్టు అటు నేషనల్, ఇటు లోకల్ మీడియాలో వరుసగా వార్తలు వస్తున్నాయి. రకుల్ తో పాటు సారా అలీ ఖాన్, రణ్వీర్ స్నేహితురాలు సైమన్ ఖంబట్టా పేర్లు ఈ వార్తల్లో నిలిచాయి. కాని అందులో నిజం లేదని ఎన్సీబీ ప్రతినిధి ఆ వార్తలను ఖండించారు. డ్రగ్ కేసులో తన పేరును ముడి పెడుతూ వార్తలు ప్రసారం చేయడంపై రకుల్ ప్రీత్ సింగ్ ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించారు.
డ్రగ్ కేసులో తనకు వ్యతిరేకంగా మీడియాలో వస్తున్న వార్తలను ఆపాలని ప్రసార మంత్రిత్వ శాఖకు ఆదేశాలు జారీ చేయాలని కోరుతూ ఢిల్లీ హైకోర్టులో రకుల్ పిటీషన్ దాఖలు చేశారు. జస్టిస్ నవీన్ చావ్లా నేతృత్వంలోని సింగిల్ బెంచ్ విచారణ చేపట్టిన రకుల్ అభ్యర్థనను పరిగణలోకి తీసుకుని కేంద్రం, ప్రసార భారతి, ప్రెస్ కౌన్సిల్ ఒక నిర్ణయం తీసుకోవాలని హైకోర్టు కోరడం జరిగింది. డ్రగ్ కేసులో రియా చక్రవర్తితో రకుల్ పేరు ముడి పెడుతూ వస్తున్న వార్తలపై మీ అభిప్రాయాలు ఏంటి.. ఆధారాలు ఏమున్నాయని కేంద్రాన్ని ఢిల్లీ హైకోర్టు ప్రశ్నించింది. అంతేకాదు ఈ వ్యవహారంలో రకుల్ అవసరమున్న ప్రతీసారి ఢిల్లీ హైకోర్టుకు వెళ్ళి రావల్సి ఉంటుందని తెలుస్తుంది.
అయితే దీనిపై నేషనల్ మీడియా ఇంకా స్పందించలేదు. రకుల్, సారా పేర్లు రియా చెప్పలేదని ఎన్సీబీ వెల్లడించిన తరవాత నేషనల్ మీడియా తీరుపై సినిమా సెలబ్రిటీలు, నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేశారు. సారీ రకుల్, సారీ సారా హ్యాష్ టాగ్స్ తో నిరసన తెలిపారు. ఏదేమైనా రకుల్ మాత్రం ఈ వ్యవహారంతో మానసికంగా బాగా ఒత్తిడికి లోనయిందని చెప్పుకుంటున్నారు. ప్రస్తుతం రకుల్ ఒక తెలుగు సినిమాలో హీరోయిన్ గా నటిస్తుంది. రీసెంట్ గా ఈ సినిమా చిత్రీకరణలో పాల్గొనేందుకు హైదరాబాద్ వచ్చింది. క్రిష్ దర్శకత్వంలో వైష్ణవ్ తేజ్ హీరోగా నటిస్తున్న ఈ సినిమా వికారాబాద్ లో చిత్రీకరణ జరుపుకుంటుంది.