Goodbye : గుడ్బై.. బాలీవుడ్లో తెరకెక్కుతున్న లేటెస్ట్ సినిమా. ప్రస్తుతం మోస్ట్ వాంటెడ్ హీరోయిన్గా టాలీవుడ్, బాలీవుడ్, కోలీవుడ్ ఇండస్ట్రీలలో వెలుగుతున్న రష్మిక మందన్న ఇందులో హీరోయిన్గా నటిస్తోంది. ప్రస్తుతం రష్మిక తెలుగులో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా నటిస్తున్న పుష్ప సినిమాలో నటిస్తోంది. సుకుమార్ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ సినిమా 5 భాషలలో రిలీజ్ కి సన్నాహాలు చేస్తున్నారు. మొదటి భాగం ఈ ఏడాది చివరిలో రానుందని మేకర్స్ క్లారిటీ ఇచ్చారు. అలాగే శర్వానంద్ కి జంటగా ఆడవాళ్ళు మీకు జోహార్లు అనే సినిమా చేస్తోంది. ఇలా తెలుగులో రెండు సినిమాలు చేస్తున్న రష్మిక తాజాగా హిందీ సినిమా షూటింగ్లో పాల్గొనింది.
ఇక బాలీవుడ్ లో సిద్దార్థ్ మల్హోత్రా కి జంటగా నటిస్తున్న మిషన్ మజ్ఞు తో పాటు బిగ్ బి అమితాబ్ బచ్చన్ తో వికాస్ దర్శకత్వంలో గుడ్బై సినిమా చేస్తోంది. ఇంతక ముందు కంగనతో క్వీన్, హృతిక్ రోషన్ తో సూపర్ 30 సినిమాలు తెరకెక్కించి బాలీవుడ్ లో స్టార్ ఇమేజ్ తెచ్చుకున్న వికాస్ – అమితాబ్ – రష్మికల కాంబినేషన్ లో సినిమా అంటే ప్రేక్షకుల్లో భారీగా అంచనాలు మొదలయ్యాయి. కాగా ఈ సినిమా తాజాగా సెట్స్ మీదకి వచ్చింది. మొదటి రోజు అమితాబ్ తో కలిసి నటించడం ఎప్పటికీ మర్చిపోలేనని రష్మిక తెలుపుతూ ఓ పిక్ ని షేర్ చేసింది.
Goodbye : అమితాబ్ – రష్మికల లేటెస్ట్ పిక్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
ప్రస్తుతం అమితాబ్ – రష్మికల లేటెస్ట్ పిక్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. తండ్రీ కూతురుల మధ్య సాగే ఆసక్తికరమైన కథతో గుడ్బై సినిమా రూపొందుతోంది. ఇక ఈ సినిమా 2022లో రిలీజ్ చేసేందుకు మేకర్స్ సన్నాహాలు చేస్తున్నారు. కాగా ఇప్పటి వరకు అమితాబ్ తో తాప్సీ పింక్, బద్లా సినిమాలు చేసి బాలీవుడ్ లో స్టార్ హీరోయిన్ గా వెలుగుతోంది. అలాగే దీపిక పదుకొణె కూడా బిగ్ బి తో పీకూ అనే సినిమా చేసింది. ఈ సినిమాతో దీపిక కూడా మంచి హిట్ అందుకుంది. ఈ క్రమంలో ఇప్పుడు రష్మిక కూడా అమితాబ్ తో చేస్తున్న గుడ్ బై ఆమెకి ఎలాంటి పేరును, సక్సెస్ ను తీసుకు వస్తుందో అని మాట్లాడుకుంటున్నారు.
Ma Annayya: ఆ సీరియల్ నటుడుతో ప్రేమాయణం నడుపుతున్న మా అన్నయ్య సీరియల్ ఫేమ్ శ్వేతా రెడ్డి.. ఫోటోలతో అడ్డంగా బుక్..!