ఒకప్పుడు మాస్ రాజ రవితేజ సినిమా వస్తుందంటే మాస్ ఆడియన్స్ తో పాటు ఫ్యామిలీ ఆడియన్స్ లోను విపరీతమైన హంగు ఆర్భాటం ఉండేది. ఇంతక ముందు రవితేజ నటించిన సినిమాలన్ని వరసగా బాక్సాఫీస్ వద్ద భారీ సక్సస్ సాధించి వసూళ్ళ సునామీని సృష్ఠించాయి. హై ఓల్టేజ్ తో ఉండే రవితేజ సినిమాలు ప్రేక్షకుల్లో డబుల్ ఎనర్జీని నింపేవి.
కాని గత కొన్ని ఏళ్ళుగా రవితేజ ఎంత కష్టపడ్డప్పటికి తన రేంజ్ సాలీడ్ హిట్ మాత్రం దక్కించుకోలేకపోతున్నాడు. ప్రేక్షకుల్లో క్రేజ్ తగ్గనప్పటికి రవితేజ ని తన సినిమాని అభిమానించే ప్రేక్షకులకి మాత్రం కాస్త డిసప్పాయింట్ కలుగుతోంది. ఆమధ్యలో వచ్చిన రాజా ది గ్రేట్ తో సక్సస్ అందుకొని ట్రాక్ ఎక్కాడని అనుకుంటే మళ్ళీ వరసగా నాలుగు సినిమాలు ఫ్లాప్ గా మిగిలాయి. అయితే ఏ హీరో అయినా సినిమా సూపర్ హిట్ అవ్వాలనే చేస్తాడు. కాని కొన్ని సార్లు తప్పుతుంటాయి. కాని ఈసారి ఆ ఛాన్సే లేదంటున్నారు. కథలో అంత దమ్ము ఉందని చెప్పుకుంటున్నారు.
గోపీచంద్ మలినేని దర్శకత్వంలో రవితేజ హ్యాట్రిక్ సినిమా చేస్తున్నాడు. ఒంగోలులో జరిగిన ఇక యదార్థ సంఘటన ఆధారంగా ఈ కథ ని తెరకెక్కిస్తున్నాడు. అయితే రవితేజ ఈ కథ మీద చాలా ధీమాగా ఉన్నాడట. ఈ సినిమాతో మళ్ళీ తన మార్క్ సాలీడ్ హిట్ అందుకుంటానని అంటున్నాడట. ఇక ఈ సినిమాతో శృతిహాసన్ మళ్ళీ తెలుగులో రీ ఎంట్రీ ఇస్తుంది. కోలీవుడ్ నటులు వరలక్ష్మీ శరత్ కుమార్, సముద్ర ఖని కీలక పాత్రలు పోషిస్తున్నారు.
ఇక ఇప్పటికే దాదాపు చిత్రీకరణ కంప్లీటయిన ఈ సినిమా మిగిలిన కొద్ది భాగాన్ని ఇటీవలే మొదలు పెట్టగా రవితేజ డబుల్ ఎనర్జీతో సెట్స్ లోకి అడుగుపెట్టాడు. కాగా ఈ సినిమాని సంక్రాంతి బరిలో దింపాలని గట్టిగా ట్రై చేస్తున్నారట. అంతేకాదు ఎన్ని సినిమాలు బరిలో దిగినప్పటికి క్రాక్ మాత్రం సాలీడ్ హిట్ కొట్టడం ఖాయమన్న నమ్మకంతో మేకర్స్ ఉన్నట్టు సమాచారం. ఇక ఈ సినిమా తర్వాత రవితేజ మరో రెండు సినిమాలకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు.
Mogalirekulu: నీకెంతా బలుపు రా?.. మొగలిరేకులు ఫేమ్ ఆర్కే నాయుడు పై సీనియర్ నటి ఫైర్..!