అమరావతి: రాజధాని అమరావతి ప్రాంతం వరద ముంపుకు గురి కావటంతో రాజధాని నిర్మాణానికి ఇది అనువైన ప్రదేశమా కాదా అనే చర్చ మొదలైందని బిజెపి నేతగా మారిన రిటైర్డ్ ఐఎఎస్ అధికారి ఐవైఆర్ కృష్ణారావు అన్నారు. రాజధానిగా అనుకూలతను ముందు అధ్యయనం చెయ్యకుండానే, ఎలాంటి సర్వే లేకుండానే స్థలాన్ని నిర్ధారణ చేసిన ప్రాంతంగా అమరావతి చరిత్రకెక్కిందని ఆయన వ్యాఖ్యానించారు.
శివరామకృష్ణన్ కమిటీ ఈ అంశాలనే ఉటంకిస్తూ అభివృద్ధి వికేంద్రీకరణకు ప్రాధాన్యమిస్తూ నివేదికను సమర్పించడం జరిగిందని ఆయన పేర్కొన్నారు. దురదృష్టం కొద్దీ ఆ సిఫార్సులను నాటి ప్రభుత్వం ఖాతరు చేయలేదని కృష్ణారావు అన్నారు. దాని ఫలితమే రాజధాని ప్రాంతం ముంపునకు గురి కావటమని ఆయన పేర్కొన్నారు.
వికేంద్రీకృత పరిపాలన దిశగా, దీర్ఘకాలిక రాష్ట్ర ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకుని నిర్మాణానికి అనువైన ప్రదేశం నగర విస్తృతి మొదలైన అంశాలను గురించి పూర్తి స్థాయిలో చర్చ జరగాల్సిన అవసరం ఎంతైనా ఉందని ఆయన అభిప్రాయపడ్డారు.
previous post
next post