న్యూఢిల్లీ: ఏపి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహనరెడ్డి ఢిల్లీ చేరుకున్నారు. గన్నవరం విమానాశ్రయం నుండి ప్రత్యేక విమానంలో ఢిల్లీకి చేరుకున్న ఆయనకు పార్టీ నేతలు, వైసిపి ఎంపిలు స్వాగతం పలికారు.
వామపక్ష తీవ్రవాద పీడిత రాష్ట్రాల్లో భద్రతను సమీక్షించేందుకు కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్షా నిర్వహిస్తున్న అంతర్ రాష్ట్ర మండలి స్థాయి సమావేశంలో వైఎస్ జగన్ పాల్గొనున్నారు. అనంతరం అమిత్షాతో జగన్ ప్రత్యేకంగా భేటీ అయ్యే అవకాశం ఉంది. కేంద్ర మంత్రి గజేంద్ర షెకావత్ను కూడా కలిసి పోలవరం ప్రాజెక్టు విషయంలో అభ్యంతరాలపై జగన్ క్లారిటీ ఇవ్వనున్నట్లు సమచారం. సాయంత్రం పలువురు కేంద్ర మంత్రులతో సమావేశం కానున్నారు. ఏపికి రావాల్సిన నిధులు, విభజన సమస్యలు, లోటు బడ్జెట్ భర్తీతో పాటు వివిధ అంశాలను జగన్ ప్రస్తావించే అవకాశం ఉంది.