న్యూఢిల్లీః మాజీ ప్రధాన మంత్రి మన్మోహన్ సింగ్కు స్పెషల్ ప్రొటెక్షన్ ఫోర్స్(ఎస్పీజీ) భద్రతను కేంద్రం వెనక్కి తీసుకుంది. అయితే, సీఆర్పీఎఫ్ భద్రతను ఆయనకు కొనసాగించనున్నట్లు కేంద్ర హోంశాఖ తెలిపింది. ఎస్పీజీ భద్రతపై సమీక్ష చేపట్టిన అనంతరం కేంద్ర హోంశాఖ ఈ నిర్ణయం తీసుకుంది. మన్మోహన్కు ఎస్పీజీ భద్రతను తొలగించినప్పటికీ… ఆయను ఉన్న జెడ్ ప్లస్ కేటగిరీ సెక్యూరిటీ కొనసాగుతుందని హోం శాఖ అధికారి చెప్పారు. మరోవైపు, పదేళ్ల పాటు దేశ ప్రధానిగా ఉన్న మన్మోహన్… తన భద్రత విషయంలో ఎలాంటి ఆందోళనకు గురికావడం లేదు. ప్రస్తుతం ఎస్పీజీ హోదా ప్రధాన మంత్రి నరేంద్ర మోదీకి, కాంగ్రెస్ జాతీయాధ్యక్షురాలు సోనియా గాంధీతోపాటు రాహుల్ గాంధీ, ప్రియాంకా గాంధీ తదితరులకు కొనసాగుతోంది.
సాధారణంగా మాజీ రాష్ట్రపతి, మాజీ ఉప రాష్ట్రపతి, మాజీ ప్రధానమంత్రులకు ఎస్పీజీ భద్రతను కల్పిస్తుంటారు. 2014 వరకూ మన్మోహన్ కుమార్తెలకు ఎస్పీజీ హోదా ఉండేది. అయితే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాకపోడంతో తమకు ఎలాంటి భద్రతా అవసరం లేదని మన్మోహన్ కుమార్తెలు స్వచ్ఛందంగా వెనక్కి ఇచ్చేశారు. అయితే ఇలా మాజీ ప్రధానుల ఎస్పీజీ సెక్యూరిటీని వెనక్కి తీసుకోవడం ఇదే తొలిసారి కాదు. గతంలో మాజీ ప్రధానులు హెచ్డీ దేవెగౌడ, వీపీ సింగ్ల ఉన్న భద్రను వెనక్కి తీసుకుంది. అయితే, మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్పేయికి మాత్రం ఆయన మరణించే వరకూ ఎస్పీజీ భద్రత కొనసాగింది. వాజ్పేయి దత్త పుత్రికకూ కూడా సెక్యూరిటీ కొనసాగించారు. మాజీ ప్రధాని ఇందిరా గాంధీ హత్య తర్వాత 1985లో ఈ ఎస్పీజీ భద్రతను అమల్లోకి తెచ్చారు.
previous post
next post