హైదరాబాదు, ఏప్రిల్ 16: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబుపై పలువురు విశ్రాంత ఐఎఎస్ అధికారులు మంగళవారం ఉమ్మడి తెలుగు రాష్ట్రాల గవర్నర్ ఈఎస్ఎల్ నరసింహన్కు వినతి పత్రాన్ని అందజేశారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎల్వి సుబ్రమణ్యం, ఎన్నికల ప్రత్యేక అధికారి గోపాలకృష్ణ ద్వివేదిలపై చంద్రబాబు అనుచిత వ్యాఖ్యలు చేశారని వారు పేర్కొన్నారు. చంద్రబాబు తన వ్యాఖ్యలను ఉపసంహరించుకొని కోరుతూ వారు లేఖ కూడా రాశారు. అయితే వారు రాసిన లేఖపై చంద్రబాబు నుండి ఎటువంటి స్పందన రాలేదు. ఈ నేపథ్యంలో మంగళవారం విశ్రాంత ఐఎఎస్ అధికారులు ఐవైఆర్ కృష్ణారావు, అజయ్ కల్లం, గోపాల్ రావు, భట్టాచార్య తదితరులు గవర్నర్ను కలిసి సీఎం చంద్రబాబుపై ఫిర్యాదు చేశారు
previous post
next post