Balakrishna: బాలకృష్ణ కెరియర్ లో అదే రీతిలో టాలీవుడ్ ఇండస్ట్రీ చరిత్రలో ఓ మైలురాయి సినిమాగా “సమరసింహారెడ్డి” నిలిచిపోయింది. అంజలి జావేరి, సిమ్రాన్, సంఘవి ఈ ముగ్గురు హీరోయిన్లు సినిమాలో నటించడం జరిగింది. 1999లో రిలీజ్ అయిన ఈ సినిమా దాదాపు 70 సెంటర్లకు పైగా అప్పట్లోనే వంద రోజులు ఆడింది. టాలీవుడ్ ఇండస్ట్రీలో ఫ్యాక్షన్ సినిమాలకు నాంది పలికింది సమరసింహా రెడ్డి. ఈ సినిమాలో బాలయ్య బాబు యాక్టింగ్ తో పాటు డైలాగ్ డెలివరీ.. రాయలసీమ ప్రాంతానికి చెందిన పౌరుషం చూపించటం లో డైరెక్టర్ బి.గోపాల్ 100% సక్సెస్ సాధించడం జరిగింది.
సినిమాకి స్టోరీ విజయేంద్రప్రసాద్ అందించారు. ఇదిలా ఉంటే ఈ సినిమా స్టోరీ మొదట బాలయ్య బాబు వినక ముందు అప్పట్లో మరో టాప్ హీరో వినటం జరిగిందట. ఆయన మరెవరో కాదు విక్టరీ వెంకటేష్. అప్పట్లో మంచి సక్సెస్ మీద వెంకటేష్ ఉండటంతో… మొదట ఆయనకి స్టోరీ వినిపించగా ఇది నా కంటే మంచి మాస్ బేస్ క్రేజీ అన్న హీరో అయితే బాగుంటుందని తెలపడంతో వెంటనే బి.గోపాల్ బాలకృష్ణకి స్టోరీ చెప్పి ఒప్పించి… సినిమా చేసి సూపర్ డూపర్ బ్లాక్ బస్టర్ హిట్ అందుకోవడం జరిగింది.
తాజాగా ఈ వార్త బయటపడింది. ఈ సినిమాలో బాలయ్య బాబు రైల్వే స్టేషన్ లో కదులుతున్న ట్రైన్ ఎక్కి విలన్ వార్నింగ్ ఇవ్వడంతో .. సినిమా లో డైలాగులు ఫ్లాష్ బ్యాక్ స్టోరీ అప్పట్లో సినిమాకి హైలెట్ గా నిలిచాయి. ముఖ్యంగా మణిశర్మ ఇచ్చిన బ్యాక్ గ్రౌండ్ స్కోర్ బీభత్సం అని చెప్పవచ్చు. అన్ని పాటలు హిట్ అవటంతో పాటు అందాల ఆడబొమ్మ అనే సాంగ్.. ఎప్పటికీ కూడా టాలీవుడ్ ఇండస్ట్రీలో ది బెస్ట్ సాంగ్. ఆ రీతిగా సక్సెస్ సాధించిన సమరసింహా రెడ్డి సినిమా స్టోరీ మొట్టమొదటిసారి వెంకటేష్ వద్దకు వెళ్లగా ఆయన రిజెక్ట్ చేయడంతో.. వెంటనే బాలయ్య ఓకే చేసి బ్లాక్ బస్టర్ అందుకున్నారు.
Mogalirekulu: నీకెంతా బలుపు రా?.. మొగలిరేకులు ఫేమ్ ఆర్కే నాయుడు పై సీనియర్ నటి ఫైర్..!