స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకు చెందిన ఎస్బీఐ జనరల్ ఇన్సూరెన్స్ తన కస్టమర్ల కోసం ఇటీవలే కొత్తగా ఎస్బీఐ షగుణ్ పేరిట ఓ నూతన ఇన్సూరెన్స్ పాలసీని అందుబాటులోకి తెచ్చింది. దీన్ని షగుణ్ – గిఫ్ట్ యాన్ ఇన్సూరెనర్స్గా వ్యవహరిస్తోంది. ఎందుకంటే ఈ ఇన్సూరెన్స్ను ఎవరైనా సరే తమ కోసం తీసుకోవచ్చు. లేదా ఇంట్లోని కుటుంబ సభ్యులు, బంధువులు, స్నేహితులు.. ఇలా ఎవరికైనా ఈ పాలసీ తీసుకుని గిఫ్ట్గా ఇవ్వవచ్చు. అందుకనే దీన్ని ఎస్బీఐ గిఫ్ట్ ఇన్సూరెన్స్ పాలసీగా వ్యవహరిస్తోంది. ఇందులో కనీసం రూ.501 ప్రీమియంతో పాలసీ తీసుకోవచ్చు. ఈ ఇన్సూరెన్స్ వల్ల పర్సనల్ యాక్సిడెంట్ కవరేజీ లభిస్తుంది. అంటే ఇన్సూర్ చేసుకున్న వ్యక్తి యాక్సిడెంట్కు గురైనా, ప్రమాదం వల్ల పూర్తిగా లేదా పాక్షికంగా అంగ వైకల్యం బారిన పడ్డా, చనిపోయినా.. ఇన్సూర్ చేసిన మొత్తం వస్తుందన్నమాట.
ఎస్బీఐ షగుణ్ ఇన్సూరెన్స్ పాలసీకి కనీసం రూ.501 ప్రీమియం చెల్లించాలి. ఎక్కువ కవరేజీ కావాలనుకుంటే రూ.1001, రూ.2001 ఇలా ప్రీమియం చెల్లించవచ్చు. ఒకసారి ఇన్సూరెన్స్ తీసుకుంటే ఏడాది వరకు పనిచేస్తుంది. తరువాత మళ్లీ రెన్యువల్ చేసుకోవాల్సి ఉంటుంది. 18 నుంచి 65 సంవత్సరాల మధ్య వయస్సు ఉన్నవారు ఎవరైనా ఈ ఇన్సూరెన్స్ను తీసుకోవచ్చు. ఈ పాలసీ తీసుకుంటే కింద తెలిపిన పలు లాభాలు కలుగుతాయి.
* ఇన్సూర్ అయిన వ్యక్తికి యాక్సిడెంట్ అయి గాయాల బారిన పడితే ఆంబులెన్స్ ఖర్చుల నిమిత్తం ఇన్సూర్ అయిన మొత్తంలో 10 శాతం లేదా రూ.1 లక్ష వరకు ఇస్తారు.
* యాక్సిడెంట్ వల్ల వాహనాలకు అయిన డ్యామేజీ ఖర్చులను భరించడం కోసం ఇన్సూర్ చేసిన మొత్తంలో 1 శాతం లేదా రూ.25వేల వరకు ఇస్తారు.
* ఇన్సూర్ అయిన వ్యక్తి యాక్సిడెంట్ వల్ల పూర్తిగా అంగవైకల్యానికి లోనైతే ఇన్సూర్ చేసిన మొత్తం నుంచి కొంత శాతాన్ని చెల్లిస్తారు.
* ఇన్సూర్ అయిన వ్యక్తి ప్రమాదవశాత్తూ మరణిస్తే వ్యక్తి నామినీకి ఇన్సూర్ చేసిన మొత్తాన్ని చెల్లిస్తారు.
* ఈ ఇన్సూరెన్స్ తీసుకునేవారు ఇన్సూర్ చేసిన మొత్తం నుంచి రూ.50వేల వరకు లేదా మొత్తం నుంచి 1 శాతం వరకు ఎడ్యుకేషన్ బెనిఫిట్ కింద పొందవచ్చు.
* ఇన్సూర్ అయిన వ్యక్తి ప్రమాదంలో పాక్షికంగా అంగవైకల్యం బారిన పడితే ఇన్సూర్ చేసిన మొత్తం నుంచి కొంత శాతాన్ని చెల్లిస్తారు.