Bapatla: బాపట్ల టీడీపీ అభ్యర్ధి నరేంద్ర వర్మకు చెందిన రాయల్ మెరైన్ కంపెనీలో పోలీసులు సోదాలు నిర్వహించారు. చీరాల మండలం కావూరి వారిపాలెంలోని కంపెనీలో సోదాలు నిర్వహించారు. కంటైనర్ లో రూ.56 లక్షలు ఉండటాన్ని గమనించి వాటిని స్వాధీనం చేసుకున్నారు. టీడీపీ అభ్యర్ధి నరేంద్ర వర్మకు చెందిన నగదుగా గుర్తించారు.
చీరాల డీఎస్పీ బేతపూడి ప్రసాద్ ఆధ్వర్యంలో పోలీసులు తనిఖీలు చేపట్టారు. కంటైనర్ లో ఉన్న నగదును పోలీసులు సీజ్ చేశారు. ప్రస్తుతం ఎలక్షన్ కోడ్ అమలులో ఉన్నందున పెద్ద ఎత్తున నగదు డంప్ చేసినట్లుగా వస్తున్న ఫిర్యాదులపై పోలీసులు రాష్ట్ర వ్యాప్తంగా వివిధ ప్రాంతాల్లో సోదాలు జరుపుతున్నారు. పెద్ద ఎత్తున ఎక్కడైనా నగదు ఉంటే ఆ నగదును స్వాధీనం చేసుకుంటున్నారు.
YSRCP: జరిగిన మంచి చూసి ఓటేయండి – జగన్