ఉమ్మడి ప్రకాశం జిల్లాలోని దర్శి నియోజకవర్గం మరోసారి వేడెక్కింది. వాస్తవానికి యథాలాపంగా రాజకీ యాలు సాగి ఉంటే ఈ నియోజకవర్గం పెద్దగా టాక్ ఆఫ్ది పాలిటిక్స్లోకి వచ్చేది కాదు. కానీ, ఇక్కడ సంచ లన మార్పులు చోటు చేసుకుంటున్నాయి. 2019 ఎన్నికల వరకు టీడీపీలోనే ఉండి.. తర్వాత.. వైసీపీలోకి చేరిన మాజీ మంత్రి, వైశ్య సామాజిక వర్గానికి చెందిన శిద్దారాఘరావు కుటుంబం తిరిగి టీడీపీలో చేరనుం ది. దీనికి ముహూర్తం కూడా ఖరారైంది.
అంతేకాదు.. శిద్దా ఇలా పార్టీ తీర్థం పుచ్చుకోగానే ఆయనకు దర్శి టికెట్ ఇచ్చేందుకు చంద్రబాబు రెడీగా ఉన్నారనేది పార్టీ వర్గాల మాట. దర్శిలో టీడీపీకి బలమైన నాయకుడు శిద్దానే. పైగా ఆర్థికంగా బలంగా ఉండడం.. వ్యాపారాలు.. వ్యవహారాల పరంగా మంచి నెట్ వర్క్ కూడా ఉండడం వంటివి ఆయనకు కలిసి వస్తున్న విషయాలు. అందుకే.. శిద్దా కొన్ని కారణాలతో గత ఎన్నికల తర్వాత టీడీపీని వీడి వైసీపీలోకి చేరినా.. చంద్రబాబు ఆయనను ఆహ్వానించారు.
కట్ చేస్తే.. ఇప్పుడు వైసీపీ కూడా దర్శి నియోజకవర్గానికి బూచేపల్లి శివప్రసాద్రెడ్డిని అభ్యర్థిగా ఖరారు చేసింది. ఇక, టీడీపీ నుంచి అప్రటిత శిద్దా రాఘవరావే పోటీ చేయనున్నారు. దీంతో ఇరువురి మధ్య పోరు జోరుగా సాగే అవకాశం ఉందని పరిశీలకులు అంచనా వేస్తున్నారు. అంతేకాదు..2014 రిజల్ట్ ఇక్కడ రిపీట్ అయినా ఆశ్చర్యం లేదనే టాక్ వినిపిస్తుండడం గమనార్హం. దీనికి ప్రధాన కారణం.. వైసీపీ కంటే కూడా.. బూచేపల్లికి సొంత పార్టీలోనే వ్యతిరేక వర్గం పెరిగిపోవడం.
బూచేపల్లి ఒంటెత్తు పోకడలతో వైసీపీలో నాయకులు రగిలిపోతున్నారు. మరీ ముఖ్యంగా సిట్టింగ్ ఎమ్మె ల్యే మద్దిశెట్టి వేణుగోపాల్ వర్గం మరింత ఆగ్రహంతో ఉంది. పైకి వీరు వైసీపీలోనే ఉన్నా.. అంతర్గతంగా మాత్రం బూచేపల్లికి వ్యతిరేకంగా పనిచేస్తున్నారు.అంతేకాదు.. తనను కాదని బూచేపల్లికి టికెట్ ఇవ్వడాన్ని మద్దిశెట్టి సోదరులు కూడా జీర్ణించుకోలేక పోతున్నారు. ఈ నేపథ్యంలో ఇక్కడ ఏకపక్షంగా శిద్దా గెలిచినా ఆశ్చర్యం లేదని పరిశీలకులు అంచనా వేస్తున్నారు. ఇక మరోవైపు.. శిద్దా గెలుపుపై వ్యాపార వర్గాలు బెట్టింగులు కడుతుండడం గమనార్హం. దీనిని బట్టే శిద్దా గెలుపు ఎలా ఉంటుందో అర్ధం చేసుకోవచ్చని అంటున్నారు పరిశీలకులు.