Social media: ప్రస్తుతం చాలా వరకు మనిషిని ప్రభావితం చేస్తున్నది ఎక్కువగా చూసుకుంటే సోషల్ మీడియా. రాజకీయ నాయకులైన ఇంకా సెలబ్రిటీలు ఎవరైనా తమ పై వచ్చే రూమర్స్ లకు.. అదే రీతిలో తాము చేసే అనేక కార్యక్రమాలకు సంబంధించిన విషయాలకు సంబంధించిన.. క్లారిఫికేషన్ సోషల్ మీడియా ద్వారా తెలియజేస్తూ ఉంటారు. ముఖ్యంగా కరోనా కారణంగా చాలా వరకు మీడియా ప్రభావం తగ్గటంతో పాటు సోషల్ మీడియా ప్రభావం బాగా పెరిగింది అని చెప్పవచ్చు.
ఇదే క్రమంలో సోషల్ మీడియా ద్వారా కూడా అనేక అవాంతరాలు జరుగుతూ ఉన్నాయి. కొన్ని కొన్ని సందర్భాలలో.. కొంతమంది మనోభావాలు దెబ్బతినేలా వాళ్లకి ఊహించుకుంటూ వివాదాలు కూడా సోషల్ మీడియా ద్వారా నెలకొంటున్నాయి. పరిస్థితి ఇలా ఉండగా తాజాగా సోషల్ మీడియా కి టాలీవుడ్ టాప్ డైరెక్టర్ కొరటాల శివ గుడ్ బై చెప్పేశారు.
Read more: Social Media: షాకింగ్ – బ్రేకింగ్ న్యూస్..! రేపటి నుండి ట్విట్టర్, ఫేస్ బుక్ పనిచేయవా..!?
ఈ విషయాన్ని స్వయంగా ఆయన సోషల్ మీడియా ద్వారానే తెలియజేశారు. తన గురించి వచ్చే విషయాలు ప్రతిదీ కూడా మీడియా ద్వారానే తెలియజేస్తాను.. మీడియాతో ఎప్పటికప్పుడు టచ్ లో ఉంటాను అంటూ పేర్కొన్నారు. ఇంత సడెన్ గా… కొరటాల శివ ఈ నిర్ణయం తీసుకోవడానికి గల కారణం ఇక పూర్తిస్థాయిలో సినిమాలపై దృష్టి పెట్టాలని.. ఎటువంటి డిస్ట్రబెన్స్ లేకుండా రాబోయే రోజుల్లో సినిమాలు చేయాలని అందువల్ల ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఇండస్ట్రీలో టాక్. భరత్ అనే నేను బ్లాక్ బస్టర్ విజయం సాధించిన తర్వాత దాదాపు ఏడాది ఖాళీగా ఉన్న కొరటాల తర్వాత ఆచార్య సినిమా స్టార్ట్ చేసి కరోనా కారణంగా రెండు సంవత్సరాలు.. ఆ ప్రాజెక్ట్ కే పరిమితం కావడంతో రాబోయే రోజుల్లో.. ఎటువంటి అవాంతరాలు లేకుండా ఫోకస్ మొత్తం సినిమాలపై దృష్టి పెట్టే రీతిలో.. కొరటాల సోషల్ మీడియాకు దూరం అయినట్లు సమాచారం.
Mogalirekulu: నీకెంతా బలుపు రా?.. మొగలిరేకులు ఫేమ్ ఆర్కే నాయుడు పై సీనియర్ నటి ఫైర్..!