Social Media: పొద్దున్న లేస్తే పేస్ బుక్, ట్విట్టర్ లేనిదే యువత ఉండలేరు.. యువతే ఏముంది..? దాదాపు అన్ని వయస్కుల్లోనూ ఇదో కల్చర్ గా మారిపోయింది. అటువంటి సామజిక మాధ్యమాలు కొన్ని రోజులు పూర్తిగా ఆగిపోతే..? పని చేయకపోతే..!? ఏదో ప్రపంచం ఆగిపోతున్నంత ఫీలింగ్ కలుగుతుంది. ఏమో.. ఆ ప్రమాదం పొంచి ఉంది. ఈ రెండు సామజిక మాధ్యమాలపై కొత్త నిబంధనల కట్టి వేలాడుతుంది. కేంద్ర ప్రభుత్వం రూపొందించిన మార్గదర్శకాలు అమలుకు గడువు సమీపిస్తోంది. ఈ ఏడాది ఫిబ్రవరి 25న కేంద్రం అమల్లోకి తెచ్చిన కొత్త నిబంధనలు గుర్తుండే ఉంటాయిగా.. సోషల్ మీడియా, డిజిటల్ మీడియా, ఓటీటీలకు కొన్ని ప్రత్యేక మార్గదర్శకాలను రూపొందించి, కచ్చితంగా అమలు చేయాల్సిందే అని స్పష్టం చేసింది. ఆ నియమావళి రేపటి నుండి అమల్లోకి రానుంది. కానీ…
Must Read it: సారంగా దారియ కొత్త రికార్డుతో తెలుగు పాటల షేక్..!
Social Media: మరో మూడు నెలల అడుగుతున్నా..!?
ఫేస్ బుక్, ట్విట్టర్ ఇంకా ఆ నియమావళిలోకి వెళ్ళలేదు. దీని ప్రకారం ఈ సోషల్ మీడియా దిగ్గజాలు తమ ఖాతాల్లో పోస్టింగులపై చాల జాగ్రత్తగా.., బాధ్యతగా ఉండాలి. ఎటువంటి ఫిర్యాదులు అందినా 24 గంటల్లో పరిష్కరించాలి. లేదా అధికారికంగా ఈ విషయాన్నీ తెలియజేయాలి. 15 రోజుల వ్యవధిలో పూర్తిగా పరిష్కరించాలి. సోషల్ మీడియా చట్టాలు నడుచుకునేలా. వీటి పర్యవేక్షణకు ఒక అధికారిని నియమించాలి. పోలీసులు, సీబీఐ, సీఐడీ వబ్టి పరిశోధన సంస్థలకు అందుబాటులో ఉంటూ ఎప్పుడైనా సమాచారం ఇచ్చేలా ఒక నోడల్ అధికారిని నియమించుకోవాలి. కానీ దేశంలోని ఏ సంస్థ ఈ పని చేయలేదు. ప్రస్తుతం అంతంతమాత్రంగానే వాడుతున్న “కూ” వేదిక తప్ప ఇంకెవ్వరూ ఈ పని చేయలేదని.. సో.. కేంద్రం రేపటి నుండి అమల్లోకి తీసుకురానున్న కొత్త నియమావళి ప్రకారం ఫేస్ బుక్, ట్విట్టర్ పని చేయకపోవచ్చని భావిస్తున్నారు. ఈ రెండు సంస్థలు మరో మూడు నెలల సమయం అడుగుతున్నాయి. ఆగష్టు 25 నాటికి మొత్తం నియమావళిని అమలు చేస్తామని కోరుతున్నాయి. కేంద్రం ఎలా స్పందిస్తుంది అనేది సందేహంగా మారింది..!