diabetis: ఇప్పటి కాలంలో ప్రపంచం మొత్తంలో చాలా మంది ఎదుర్కొనే అనారోగ్య సమస్య షుగర్. చాలా చిన్న వయస్సులోనే టైప్ 2 డయాబెటిస్ ఎదురుకుంటున్నారు . దీనితో పాటు అనేక ఇతర అనారోగ్య సమస్యలు కూడా వస్తున్నాయి.అయినా కూడా డయాబెటిస్ ప్రమాదాన్ని ఎవరూ తెలుసుకోలేక పోతున్నారు. ముందుగానే కొన్ని జాగ్రత్తలు పాటిస్తే షుగరు రాకుండా జాగ్రత్త పడవచ్చు. ఒకవేళ ఇప్పటికే టైప్ 2 డయాబెటిస్ వచ్చిన వారు తమ జీవన విధానంలో కొన్ని మార్పులు చేసుకోవడం ద్వారా షుగర్ లెవల్స్నుఅదుపు చేసుకోవచ్చు.
అలాగే తీసుకునే ఆహారంలో కింద కొన్ని పండ్లను చేర్చుకుంటే షుగరు ను విజయవంతంగా తగ్గించుకోవచ్చు.నారింజ పండ్లు, స్ట్రాబెర్రీలు, చెర్రీలు తదితర పండ్లలో ఎక్కువగా ఉండే విటమిన్ సి టైప్ 2 డయాబెటిస్ను అదుపు చేయడంలో సూపర్ గా పనిచేస్తుంది. యాపిల్ పండ్లు, అవకాడోలలో ఉండే ఫైబర్ కూడా రక్తంలోని గ్లూకోజ్ స్థాయిలను అదుపు చేయగలవు. వీటితో షుగర్ నియంత్రణలో ఉంటుంది.ఇక ఈ సీజన్లో అధికంగా లభించే నేరేడు పండ్లు కూడా షుగరు ను అదుపు చేయడం లో ముందుంటాయి. నేరేడు పండ్లను తినడం తో పాటు ఆ పండ్లలో ఉండే విత్తనాలను ఎండబెట్టి తయారు చేసుకున్న పొడిని ప్రతి రోజు తీసుకోవడం వల్ల కూడా రక్తంలో ఉండే గ్లూకోజ్ స్థాయి తగ్గుతుంది. షుగరు అదుపులో ఉంటుంది.
దానిమ్మ పండ్లు,పైనాపిల్, ఉసిరి కాయ రసం, బొప్పాయి పండ్లు షుగరు ను నియంత్రించేందుకు బాగా ఉపయోగపడతాయి. వీటిని ప్రతి రోజు ఆహారంలో భాగం చేసుకుంటే కేవలం షుగరు తగ్గడం తో పాటుకొన్ని ముఖ్యమైన పోషకాలు కూడా పొందగలుగుతాం.
కాబట్టి వీటిని ఆహారంలో తీసుకుంటూ వ్యాయామం చేస్తూ ఆహార నియమాలు పాటించడం వలన కచ్చితం గా షుగరు వ్యాధి మీద విజయం సాధించ వచ్చు.